వినుకొండకు సుమారు 20 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. భూమికి దాదాపు 10 కిలోమీటర్ల లోతులో ఈ ప్రకంపనలు సంభవించినట్లు నిర్ధారించారు.
ప్రకంపనలు సంభవించిన సమయంలో ఇళ్లలోని వస్తువులు స్వల్పంగా కదలడంతో ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. అయితే ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం లేదా ఆస్తినష్టం జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.
నిపుణుల ప్రకారం ఇది స్వల్ప తీవ్రత గల భూకంపం కావడంతో పెద్దగా ప్రమాదం ఉండదని, అయినప్పటికీ జాగ్రత్తలు పాటించడం అవసరమని సూచిస్తున్నారు. రాబోయే ఐదు రోజులలో మరికొన్ని స్వల్ప ప్రకంపనలు నమోదయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.
ప్రజలు అపోహలకు లోనుకాకుండా అప్రమత్తంగా ఉండాలని, అనుమానాస్పద పరిస్థితుల్లో స్థానిక అధికారులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. భూకంపాల సమయంలో భయపడకుండా సురక్షిత ప్రదేశాల్లో ఉండటం, భవనాల బయట ఖాళీ ప్రదేశాలకు వెళ్లడం వంటి ప్రాథమిక జాగ్రత్తలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి