Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 12:57 AM

వికలాంగులకు 5% రిజర్వేషన్ లేకుండా ఎస్సీ కార్పొరేషన్ నోటిఫికేషన్ NPRD

వికలాంగులకు 5% రిజర్వేషన్ లేకుండా ఎస్సీ కార్పొరేషన్ నోటిఫికేషన్ NPRD

వికలాంగులకు 5% రిజర్వేషన్ లేకుండా ఎస్సీ కార్పొరేషన్ నోటిఫికేషన్ NPRD
April 18, 2026 06:37 PM 87 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి,: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల మంజూరులో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోవడంపై వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిరుద్యోగ యువత కోసం 37 రకాల యూనిట్లకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, విడుదలైన నోటిఫికేషన్లలో వికలాంగుల రిజర్వేషన్ ప్రస్తావన లేకపోవడం అన్యాయమని పేర్కొంది.

2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 5 శాతం రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉన్నా, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని NPRD జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ఆరోపించారు. దీనివల్ల స్వయం ఉపాధి అవకాశాల్లో వికలాంగులు వెనుకబడుతున్నారని తెలిపారు.

ఈ అంశంపై ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించగా, ఆయన సానుకూలంగా స్పందించినప్పటికీ, జిల్లా స్థాయి నోటిఫికేషన్లలో మార్పులు కనిపించడం లేదని చెప్పారు. వెంటనే నోటిఫికేషన్లు సవరించి వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని NPRD జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.

ఈ ప్రకటనపై అధ్యక్షుడు సురూప ప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లపల్లి స్వామి, కోశాధికారి కొత్త లలిత తదితరులు సంతకాలు చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News