Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:29 PM

వికలాంగులకు 5% రిజర్వేషన్ లేకుండా ఎస్సీ కార్పొరేషన్ నోటిఫికేషన్ NPRD

వికలాంగులకు 5% రిజర్వేషన్ లేకుండా ఎస్సీ కార్పొరేషన్ నోటిఫికేషన్ NPRD

వికలాంగులకు 5% రిజర్వేషన్ లేకుండా ఎస్సీ కార్పొరేషన్ నోటిఫికేషన్ NPRD
18-04-2026 92 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి,: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల మంజూరులో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోవడంపై వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిరుద్యోగ యువత కోసం 37 రకాల యూనిట్లకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, విడుదలైన నోటిఫికేషన్లలో వికలాంగుల రిజర్వేషన్ ప్రస్తావన లేకపోవడం అన్యాయమని పేర్కొంది.

2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 5 శాతం రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉన్నా, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని NPRD జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ఆరోపించారు. దీనివల్ల స్వయం ఉపాధి అవకాశాల్లో వికలాంగులు వెనుకబడుతున్నారని తెలిపారు.

ఈ అంశంపై ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించగా, ఆయన సానుకూలంగా స్పందించినప్పటికీ, జిల్లా స్థాయి నోటిఫికేషన్లలో మార్పులు కనిపించడం లేదని చెప్పారు. వెంటనే నోటిఫికేషన్లు సవరించి వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని NPRD జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.

ఈ ప్రకటనపై అధ్యక్షుడు సురూప ప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లపల్లి స్వామి, కోశాధికారి కొత్త లలిత తదితరులు సంతకాలు చేశారు.

Sthanikam

వికలాంగులకు 5% రిజర్వేషన్ లేకుండా ఎస్సీ కార్పొరేషన్ నోటిఫికేషన్ NPRD

Article Image

యాదాద్రి భువనగిరి,: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల మంజూరులో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోవడంపై వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిరుద్యోగ యువత కోసం 37 రకాల యూనిట్లకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, విడుదలైన నోటిఫికేషన్లలో వికలాంగుల రిజర్వేషన్ ప్రస్తావన లేకపోవడం అన్యాయమని పేర్కొంది.

2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 5 శాతం రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉన్నా, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని NPRD జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ఆరోపించారు. దీనివల్ల స్వయం ఉపాధి అవకాశాల్లో వికలాంగులు వెనుకబడుతున్నారని తెలిపారు.

ఈ అంశంపై ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించగా, ఆయన సానుకూలంగా స్పందించినప్పటికీ, జిల్లా స్థాయి నోటిఫికేషన్లలో మార్పులు కనిపించడం లేదని చెప్పారు. వెంటనే నోటిఫికేషన్లు సవరించి వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని NPRD జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.

ఈ ప్రకటనపై అధ్యక్షుడు సురూప ప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లపల్లి స్వామి, కోశాధికారి కొత్త లలిత తదితరులు సంతకాలు చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News