వికలాంగులకు 5% రిజర్వేషన్ లేకుండా ఎస్సీ కార్పొరేషన్ నోటిఫికేషన్ NPRD
వికలాంగులకు 5% రిజర్వేషన్ లేకుండా ఎస్సీ కార్పొరేషన్ నోటిఫికేషన్ NPRD
Editor Desk
యాదాద్రి భువనగిరి,: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల మంజూరులో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోవడంపై వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిరుద్యోగ యువత కోసం 37 రకాల యూనిట్లకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, విడుదలైన నోటిఫికేషన్లలో వికలాంగుల రిజర్వేషన్ ప్రస్తావన లేకపోవడం అన్యాయమని పేర్కొంది.
2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 5 శాతం రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉన్నా, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని NPRD జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ఆరోపించారు. దీనివల్ల స్వయం ఉపాధి అవకాశాల్లో వికలాంగులు వెనుకబడుతున్నారని తెలిపారు.
ఈ అంశంపై ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ను కలిసి వినతిపత్రం సమర్పించగా, ఆయన సానుకూలంగా స్పందించినప్పటికీ, జిల్లా స్థాయి నోటిఫికేషన్లలో మార్పులు కనిపించడం లేదని చెప్పారు. వెంటనే నోటిఫికేషన్లు సవరించి వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని NPRD జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.
ఈ ప్రకటనపై అధ్యక్షుడు సురూప ప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లపల్లి స్వామి, కోశాధికారి కొత్త లలిత తదితరులు సంతకాలు చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి