Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడే మోడల్ స్కూల్ ప్రవేశ పరీక్ష కదం తొక్కిన గిల్.. కోల్‌కతాపై గుజరాత్‌ ఘన విజయం రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 18, 2026 08:13 PM

వికలాంగులకు 5% రిజర్వేషన్ లేకుండా ఎస్సీ కార్పొరేషన్ నోటిఫికేషన్ NPRD

వికలాంగులకు 5% రిజర్వేషన్ లేకుండా ఎస్సీ కార్పొరేషన్ నోటిఫికేషన్ NPRD

వికలాంగులకు 5% రిజర్వేషన్ లేకుండా ఎస్సీ కార్పొరేషన్ నోటిఫికేషన్ NPRD
April 18, 2026 06:37 PM 14 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

యాదాద్రి భువనగిరి,: ఎస్సీ కార్పొరేషన్ ద్వారా స్వయం ఉపాధి రుణాల మంజూరులో వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయకపోవడంపై వికలాంగుల హక్కుల జాతీయ వేదిక (NPRD) తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి నిరుద్యోగ యువత కోసం 37 రకాల యూనిట్లకు రుణాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించినప్పటికీ, విడుదలైన నోటిఫికేషన్లలో వికలాంగుల రిజర్వేషన్ ప్రస్తావన లేకపోవడం అన్యాయమని పేర్కొంది.

2016 వికలాంగుల హక్కుల పరిరక్షణ చట్టం ప్రకారం 5 శాతం రిజర్వేషన్ తప్పనిసరిగా అమలు చేయాల్సి ఉన్నా, అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని NPRD జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ ఆరోపించారు. దీనివల్ల స్వయం ఉపాధి అవకాశాల్లో వికలాంగులు వెనుకబడుతున్నారని తెలిపారు.

ఈ అంశంపై ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్‌ను కలిసి వినతిపత్రం సమర్పించగా, ఆయన సానుకూలంగా స్పందించినప్పటికీ, జిల్లా స్థాయి నోటిఫికేషన్లలో మార్పులు కనిపించడం లేదని చెప్పారు. వెంటనే నోటిఫికేషన్లు సవరించి వికలాంగులకు 5 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని NPRD జిల్లా కమిటీ డిమాండ్ చేసింది.

ఈ ప్రకటనపై అధ్యక్షుడు సురూప ప్రకాష్, వర్కింగ్ ప్రెసిడెంట్ బోల్లపల్లి స్వామి, కోశాధికారి కొత్త లలిత తదితరులు సంతకాలు చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News