విజేతలకు నగదు బహుమతులు
విజేతలకు నగదు బహుమతులు
Editor Desk
చిట్యాల స్థానిక ప్రతినిధి ప్రశాంత్
చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో ఈరమల్ల లలిత జ్ఞాపకార్థంగా వారి కుమారులు నిర్వహించిన టోర్నమెంట్ ఘనంగా జరిగింది. ఈ టోర్నమెంట్లో మొదటి బహుమతిగా రూ.5,016, రెండో బహుమతిగా రూ.3,016లను విజేతలకు అందజేశారు. చిన్నగకాపర్తి గ్రామ సర్పంచ్ ఆవల సుందర్ చేతులమీదుగా బహుమతుల ప్రదానం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్ ఆవల సుందర్ మాట్లాడుతూ గ్రామంలో ఇకపై ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని, యువకులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. యువత క్రీడలు, వివిధ పోటీల్లో చురుగ్గా పాల్గొని తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు.అనంతరం నూతనంగా ఎన్నికైన గ్రామ పాలకవర్గాన్ని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్ బెల్లంకొండ లావణ్య రఘు, రుద్రారపు లక్ష్మణ్, పల్లపు పరమేశ్వరి ప్రశాంత్,ఈరుమల దయాకర్, వలిగొండ కవిత, సత్యనారాయణ, దేశపాక మధు, నందిపాటి పార్వతమ్మ బాలయ్య, పెరిక నాగరాజు, జగదీష్ చరణ్ మామిళ్ల నరేష్ ఆవుల కిరణ్ బాలరాజ్ శ్రీను గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి