Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
స్టేట్ ర్యాంక్ సాధించిన సోమపంగు శర్మని వాట్సాప్‌లో భూ నమోదు సేవలు ప్రారంభం కంబాలపల్లి–బీదానిపల్లి మధ్య కొత్త తారు రోడ్డు పనులు పరిశీలన సోమందేపల్లి యువతి సాహితకు పట్టా ప్రదానం పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ఈడెన్‌లో ముకుల్ 'తుపాన్'.. లక్నో సూపర్ విక్టరీ! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “ఆయన స్వతంత్ర మార్గంలో ప్రయాణిస్తే దేశవ్యాప్తంగా ఒక కొత్త యువ కేంద్రీకృత రాజకీయ శక్తిగా ఎదుగుతారు” “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 12, 2026 11:11 PM

విజేతలకు నగదు బహుమతులు

విజేతలకు నగదు బహుమతులు

విజేతలకు నగదు బహుమతులు
January 16, 2026 06:49 AM 304 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

చిట్యాల స్థానిక ప్రతినిధి ప్రశాంత్

చిట్యాల మండలం చిన్న కాపర్తి గ్రామంలో ఈరమల్ల లలిత జ్ఞాపకార్థంగా వారి కుమారులు నిర్వహించిన టోర్నమెంట్‌ ఘనంగా జరిగింది. ఈ టోర్నమెంట్‌లో మొదటి బహుమతిగా రూ.5,016, రెండో బహుమతిగా రూ.3,016లను విజేతలకు అందజేశారు. చిన్నగకాపర్తి గ్రామ సర్పంచ్‌ ఆవల సుందర్‌ చేతులమీదుగా బహుమతుల ప్రదానం జరిగింది.ఈ సందర్భంగా సర్పంచ్‌ ఆవల సుందర్‌ మాట్లాడుతూ గ్రామంలో ఇకపై ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని నిర్వహిస్తామని, యువకులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తామని తెలిపారు. యువత క్రీడలు, వివిధ పోటీల్లో చురుగ్గా పాల్గొని తమ ప్రతిభను చాటాలని పిలుపునిచ్చారు.అనంతరం నూతనంగా ఎన్నికైన గ్రామ పాలకవర్గాన్ని శాలువాలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఉప సర్పంచ్‌ బెల్లంకొండ లావణ్య రఘు, రుద్రారపు లక్ష్మణ్, పల్లపు పరమేశ్వరి ప్రశాంత్,ఈరుమల దయాకర్‌, వలిగొండ కవిత, సత్యనారాయణ, దేశపాక మధు, నందిపాటి పార్వతమ్మ బాలయ్య, పెరిక నాగరాజు, జగదీష్ చరణ్ మామిళ్ల నరేష్ ఆవుల కిరణ్ బాలరాజ్ శ్రీను గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News