Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పోలీసుల ఆరోగ్యరక్షణకు ‘సహస్ర’ అండ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 26, 2026 03:56 PM

విజయవాడ కోర్టు సంచలన తీర్పు పెళ్లి పేరుతో సొంత చెల్లిని అత్యాచారం చేసిన వ్యక్తికి జీవిత ఖైదు

విజయవాడ కోర్టు సంచలన తీర్పు పెళ్లి పేరుతో సొంత చెల్లిని అత్యాచారం చేసిన వ్యక్తికి జీవిత ఖైదు

విజయవాడ కోర్టు సంచలన తీర్పు పెళ్లి పేరుతో సొంత చెల్లిని అత్యాచారం చేసిన వ్యక్తికి జీవిత ఖైదు
February 13, 2026 07:17 AM 86 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

చెల్లిపై అత్యాచారం చేసిన అన్నపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు

స్పీడ్ ట్రయల్‌గా విచారణ జరిపిన విజయవాడ పోక్సో కోర్టు న్యాయాధికారి

మరణించే వరకు జీవితకాల కారాగార శిక్ష విధించిన న్యాయమూర్తి

సొంత చెల్లిని పెళ్లి చేసుకొని, ఆమెపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడి గర్భానికి కారణమైన యువకుడి కేసులో విజయవాడ పోక్సో కోర్టు కీలక తీర్పు ఇచ్చింది. నిందితుడికి మరణించే వరకూ జైలు శిక్ష విధించింది. వివరాల్లోకి వెళితే.. ఓ కుటుంబానికి చెందిన దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ కలహాల కారణంగా తల్లిదండ్రులు విడిగా నివసిస్తున్నారు. తల్లి ఇద్దరు కుమార్తెలతో కలిసి కృష్ణా జిల్లా పమిడిముక్కల మండలం మంటాడ గ్రామంలో ఉండగా, తండ్రి కుమారుడితో కలిసి ప్రకాశం జిల్లా కొండపి మండలం పెంట్లూరులో స్థిరపడ్డాడు. 2023లో 21 ఏళ్ల కుమారుడు తల్లి, చెల్లెళ్లను కలిసేందుకు వస్తున్నానని చెప్పి మంటాడకు చేరుకున్నాడు. అక్కడ పెద్ద చెల్లి (17)తో సన్నిహితంగా ఉన్న ఫొటోలు తీసి బెదిరిస్తూ పలుమార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. 2024 క్రిస్మస్ సందర్భంగా మళ్లీ మంటాడకు వచ్చిన అతడు.. తండ్రి వద్దకు తీసుకెళ్తానని చెప్పి బాలికను విజయవాడలోని ఓ చర్చికి తీసుకెళ్లి తాళి కట్టాడు. అనంతరం ఆమెను హైదరాబాద్‌కు తీసుకెళ్లి అక్కడ కూడా అనేకసార్లు లైంగిక దాడి చేసినట్లు విచారణలో వెల్లడైంది. బాలిక గర్భం దాల్చిన విషయం తెలిసిన తరువాత నిందితుడు ఆమెను గత ఏడాది ఫిబ్రవరిలో ఒంగోలు బస్టాండులో వదిలేసి హైదరాబాద్ వెళ్లిపోయాడు. ఇంటికి వచ్చిన బాలిక కొన్ని రోజులకే జ్వరం, వాంతులతో అస్వస్థతకు గురి కావడంతో తల్లి వైద్య పరీక్షలు చేయించగా బాలిక గర్భిణిగా తేలింది. ఆమెను తల్లి గట్టిగా ప్రశ్నించగా జరిగిన విషయం మొత్తం చెప్పింది. తల్లి ఫిర్యాదు మేరకు పమిడిముక్కల పోలీసులు నిందితుడిపై పోక్సో సహా పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. గుడివాడ డీఎస్పీ ధీరజ్ వినీల్ నిందితుడిని పెంట్లూరులో అరెస్టు చేశారు. ఈ కేసును స్పీడ్ ట్రయల్‌గా విజయవాడ పోక్సో కోర్టు జడ్జి వి.భవానీ విచారణ జరిపి నిన్న తీర్పు వెల్లడించారు. నిందితుడికి మరణించే వరకు జీవితకాల కారాగార శిక్ష, రూ.6 వేల జరిమానా విధించారు. అలాగే బాధితురాలికి రూ.30 వేలు చెల్లించాలని ఆదేశించారు. ప్రభుత్వం నుంచి బాలికకు అందాల్సిన రూ.5 లక్షల సహాయం త్వరగా అందేలా చూడాలని జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీని కోర్టు ఆదేశించింది.


మీ స్పందన? 2 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News