Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:15 PM

విజయశాంతికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యమకారుల ఫోరం నేతలు

విజయశాంతికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యమకారుల ఫోరం నేతలు

విజయశాంతికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యమకారుల ఫోరం నేతలు
01-04-2026 54 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

హైదరాబాద్,

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు ఎమ్మెల్సీ, సినీనటి విజయశాంతిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది.

ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల త్యాగాలు మరచిపోలేనివని అన్నారు. ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ, వారికి న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల పాత్ర అమోఘమని, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఉద్యమకారులకు తప్పనిసరిగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దయానంద్, సీనియర్ నాయకులు జగన్, ఆర్కే భూపాల్, నాగజ్యోతి, మంజూష, తొలి దశ ఉద్యమకారులు కొండ స్వామి, ఆడెపు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు

Sthanikam

విజయశాంతికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యమకారుల ఫోరం నేతలు

Article Image

హైదరాబాద్,

తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు ఎమ్మెల్సీ, సినీనటి విజయశాంతిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బంజారాహిల్స్‌లోని ఆమె నివాసంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది.

ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల త్యాగాలు మరచిపోలేనివని అన్నారు. ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ, వారికి న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల పాత్ర అమోఘమని, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు.

ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఉద్యమకారులకు తప్పనిసరిగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దయానంద్, సీనియర్ నాయకులు జగన్, ఆర్కే భూపాల్, నాగజ్యోతి, మంజూష, తొలి దశ ఉద్యమకారులు కొండ స్వామి, ఆడెపు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News