విజయశాంతికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యమకారుల ఫోరం నేతలు
విజయశాంతికి కృతజ్ఞతలు తెలిపిన ఉద్యమకారుల ఫోరం నేతలు
Editor Desk
హైదరాబాద్,
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం నాయకులు ఎమ్మెల్సీ, సినీనటి విజయశాంతిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. బంజారాహిల్స్లోని ఆమె నివాసంలో రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈ భేటీ జరిగింది.
ఈ సందర్భంగా విజయశాంతి మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారుల త్యాగాలు మరచిపోలేనివని అన్నారు. ఉద్యమకారులకు అన్యాయం జరిగిందని పేర్కొంటూ, వారికి న్యాయం జరిగే వరకు తాను అండగా ఉంటానని హామీ ఇచ్చారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల పాత్ర అమోఘమని, వారి సమస్యల పరిష్కారం కోసం పోరాటం కొనసాగుతుందని తెలిపారు.
ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఉద్యమకారులకు తప్పనిసరిగా అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న, గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు దయానంద్, సీనియర్ నాయకులు జగన్, ఆర్కే భూపాల్, నాగజ్యోతి, మంజూష, తొలి దశ ఉద్యమకారులు కొండ స్వామి, ఆడెపు శివకుమార్ తదితరులు పాల్గొన్నారు
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి