వెంపటిలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం వేడుకలు
వెంపటిలో ఘనంగా స్వపరిపాలన దినోత్సవం వేడుకలు
Bandi Kiran Kumar
తుంగతుర్తి మండలం వెంపటి ప్రాథమిక పాఠశాలో శనివారం స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు . ఈ సందర్భంగా విద్యార్థులు వేషధారణతో పాత్రలు పోషించి పలువురిని ఆకట్టుకున్నారు.విద్యార్థిని విద్యార్థులకు ప్రశంసా పత్రాలు, మెమొంటోలు అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు చిత్తలూరి వెంకట్రామనరసమ్మ మాట్లాడుతూ ...విద్యార్థులకు నిజాయితీ, క్రమశిక్షణ, బాధ్యత వంటి విలువలను చిన్నప్పటి నుంచి అలవాటు చేసుకోవాలని సూచించారు,చిన్నప్పటినుంచి సమాజంలోని వివిధ బాధ్యతల గురించి అవగాహన కల్పించడం ద్వారా విద్యార్థులు భవిష్యత్తులో మంచి పౌరులుగా ఎదుగుతారని, విద్యార్థులు ప్రజాప్రతినిధులు, అధికారులు,ఉపాధ్యాయుల పాత్రలను స్వీకరించి నిర్వహించడం చాలా అభినందనీయమని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయలు భీవనపల్లి శ్రీనివాస్,మల్లెపాక రవీందర్,గట్టు మాధవి,బండారు భవాని, జీడి అనిల్ కుమార్, మిట్టగడుపుల విక్రం, మాలోతుకృష్ణ, గుండ్ల ఆంజనేయులు,రామణ బోయిన మౌనిక, పంజాల మంజుల, గోరోజు రమాదేవి లు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి