వెలిమినేడు సంక్రాంతి క్రీడోత్సవాల్లో విజేతలకు బహుమతులు
వెలిమినేడు సంక్రాంతి క్రీడోత్సవాల్లో విజేతలకు బహుమతులు
Komidala Mahender reddy
యువతకు క్రీడలు క్రమశిక్షణ, ఉల్లాసం అందిస్తాయి : జూలకంటి రంగారెడ్డి
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి క్రీడోత్సవాల్లో విజేతలైన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. 8వ వార్డు సభ్యుడు నాతి కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా నాయకుడు జిట్ట నగేష్, డీవైఎఫ్ఐ రాష్ట్ర-జిల్లా కార్యదర్శి కోట రమేష్, మల్లం మహేష్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విజేతలకు ట్రోఫీలు, మెడల్స్ అందజేసి అభినందించారు. అనంతరం ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నాటక ప్రదర్శన నిర్వహించగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రీడలు యువతలోమానసికఉల్లాసాన్నిపెంపొందించడమే కాకుండా క్రమశిక్షణను అలవర్చుతాయని పేర్కొన్నారు. యువత క్రీడల పట్ల అంకితభావంతో ముందుకు సాగాలని సూచించారు. వెలిమినేడుగ్రామంలోనిర్వహించిన సంక్రాంతి క్రీడోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా యువతకు ఆదర్శంగా నిలవాలని జూలకంటి రంగారెడ్డి, తుమ్మల వీరారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ స్థాయి సీపీఎం, ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ నాయకులు, శాఖ కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలతో పాటు వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి