Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 06:44 AM

వెలిమినేడు సంక్రాంతి క్రీడోత్సవాల్లో విజేతలకు బహుమతులు

వెలిమినేడు సంక్రాంతి క్రీడోత్సవాల్లో విజేతలకు బహుమతులు

వెలిమినేడు సంక్రాంతి క్రీడోత్సవాల్లో విజేతలకు బహుమతులు
March 07, 2026 07:04 PM 82 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

యువతకు క్రీడలు క్రమశిక్షణ, ఉల్లాసం అందిస్తాయి : జూలకంటి రంగారెడ్డి

నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు గ్రామంలో ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్‌ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి క్రీడోత్సవాల్లో విజేతలైన క్రీడాకారులకు బహుమతులు అందజేశారు. 8వ వార్డు సభ్యుడు నాతి కిరణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి, జిల్లా నాయకుడు జిట్ట నగేష్, డీవైఎఫ్ఐ రాష్ట్ర-జిల్లా కార్యదర్శి కోట రమేష్, మల్లం మహేష్ మరియు గ్రామ సర్పంచ్ బొంతల చంద్రారెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు.ఈ సందర్భంగా విజేతలకు ట్రోఫీలు, మెడల్స్ అందజేసి అభినందించారు. అనంతరం ప్రజానాట్యమండలి ఆధ్వర్యంలో నాటక ప్రదర్శన నిర్వహించగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ క్రీడలు యువతలో మానసిక ఉల్లాసాన్ని పెంపొందించడమే కాకుండా క్రమశిక్షణను అలవర్చుతాయని పేర్కొన్నారు. యువత క్రీడల పట్ల అంకితభావంతో ముందుకు సాగాలని సూచించారు. వెలిమినేడు గ్రామంలో నిర్వహించిన సంక్రాంతి క్రీడోత్సవాలు రాష్ట్రవ్యాప్తంగా యువతకు ఆదర్శంగా నిలవాలని జూలకంటి రంగారెడ్డి, తుమ్మల వీరారెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమాన్ని మరింత ఉత్సాహభరితంగా మార్చేందుకు నిర్వాహకులు ప్రదర్శించిన 'వీర తెలంగాణ' వీధి నాటకం ఆహూతులను కట్టిపడేసింది. తెలంగాణ పోరాట స్ఫూర్తిని కళ్లకు కట్టినట్లు చూపించిన ఈ నాటకం విశేష స్పందన రాబట్టింది.

ఈ కార్యక్రమంలో జిల్లా, మండల, గ్రామ స్థాయి సీపీఎం, ఎస్‌ఎఫ్‌ఐ, డీవైఎఫ్ఐ నాయకులు, శాఖ కార్యదర్శులు, కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. గ్రామ ప్రజలతో పాటు వివిధ పార్టీల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News