Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:11 AM

వ్యర్థాల నిర్వహణపై విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన

వ్యర్థాల నిర్వహణపై విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన

వ్యర్థాల నిర్వహణపై విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన నాగార్జున ప్రభుత్వ కళాశాల విద్యార్థుల క్షేత్ర పర్యటన
March 12, 2026 04:15 PM 10 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పర్యావరణ పరిరక్షణపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు నాగార్జున గవర్నమెంట్ కాలేజీ లోని ఏకో క్లబ్ ఆధ్వర్యంలో ధండెంపల్లి గ్రామంలోని వ్యర్థాల నిర్వహణ కేంద్రానికి క్షేత్ర పర్యటన నిర్వహించారు. ఈ కార్యక్రమం నేషనల్ గ్రీన్ కోర్ప్స్సూ చనల మేరకు చేపట్టినట్లు కళాశాల వర్గాలు తెలిపాయి.

ఈ పర్యటనను వైస్ ప్రిన్సిపాళ్లు Dr. పరంగి రవి , Dr. A. శ్రీనివాసులు , పరీక్షల నియంత్రణాధికారి Dr. D. మునుస్వామి , విద్యా సమన్వయకర్త Dr. బత్తిని నాగరాజు ప్రారంభించారు.

ఏకో క్లబ్ సమన్వయకర్త వి. శిరీష మాట్లాడుతూ వ్యర్థాలను సరైన విధంగా వర్గీకరించడం అత్యంత ముఖ్యమని తెలిపారు. ఇంటి వద్దే తడి వ్యర్థాలు, పొడి వ్యర్థాలను వేరు చేయడం ద్వారా పర్యావరణ కాలుష్యాన్ని తగ్గించవచ్చని చెప్పారు. అలాగే తగ్గించు–మళ్లీ వాడు–మళ్లీ తయారు చేయు అనే విధానాన్ని పాటించడం ద్వారా వ్యర్థాలను ఉపయోగకరమైన వనరులుగా మార్చుకోవచ్చని విద్యార్థులకు వివరించారు. తడి వ్యర్థాలను ఎరువుగా మార్చి వ్యవసాయం, తోటలలో వినియోగించవచ్చని తెలిపారు.

ఈ సందర్భంగా రాష్ట్ర స్థాయి క్షేత్ర పర్యటన అధికారి సూర్యకిరణ్ , జిల్లా స్వచ్ఛ భారత్ సమన్వయకర్త మొయినుద్దీన్వ్య ర్థాల వర్గీకరణ ప్రక్రియను విద్యార్థులకు ప్రత్యక్షంగా చూపించి వివరించారు.

ఈ కార్యక్రమంలో ఏకో క్లబ్ సభ్యులు కె. శివరాణి, Dr. P. సిద్దేశ్ గౌడ్ , Dr. D. కృష్ణ తో పాటు విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News