Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
'ఐరా' గ్లోబల్ స్కూల్ విద్యార్థుల ఘనత లేపాక్షిలో జరగనున్న సిపిఐ సత్యసాయి జిల్లా రాజకీయ శిక్షణ తరగతులను జయప్రదం చేయండి అంబేద్కర్ గురుకుల పాఠశాలలో విద్యార్థులకు పుట్టపర్తి శక్తి బృందం–2 అవగాహన కార్యక్రమం డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం తల్లికి వందనం అలర్ట్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 11, 2026 06:09 PM

వ్యక్తిగత శ్రేష్ఠతకు భావోద్వేగ మేధస్సు అవసరం.వరుణ్ అగర్వాల్

వ్యక్తిగత శ్రేష్ఠతకు భావోద్వేగ మేధస్సు అవసరం.వరుణ్ అగర్వాల్

వ్యక్తిగత శ్రేష్ఠతకు భావోద్వేగ మేధస్సు అవసరం.వరుణ్ అగర్వాల్
March 11, 2026 05:53 PM 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ల్గొండ: భావోద్వేగ మేధస్సు పెంపొందించుకుంటే వ్యక్తిగత శ్రేష్ఠత సాధించవచ్చని నిపుణులు పేర్కొన్నారు. నల్గొండలోని నాగార్జున ప్రభుత్వ కళాశాలలో అకడమిక్ బ్రాంచ్, భక్తివేదాంత ఇనిస్టిట్యూట్, నేషనల్ సర్వీస్ స్కీమ్ యూనిట్ల ఆధ్వర్యంలో “వ్యక్తిగత శ్రేష్ఠత కోసం భావోద్వేగ మేధస్సు” అనే అంశంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు.

కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సముద్రాల ఉపేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ముఖ్యవక్తగా పాల్గొన్న వరుణ్ అగర్వాల్ (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కాన్పూర్) మాట్లాడుతూ సైన్స్ మరియు ఆధ్యాత్మికత ద్వారా సమతుల్యమైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవచ్చని తెలిపారు.

మరో ముఖ్యవక్త కె. వాసుదేవ రావు (అలుమ్నస్, ఐఐటి కాన్పూర్; ప్రెసిడెంట్, భక్తివేదాంత ఇనిస్టిట్యూట్ కోల్‌కతా) మాట్లాడుతూ కోపం, సంతోషం వంటి భావోద్వేగాలను సమన్వయం చేసుకోవాలని సూచించారు. భావోద్వేగాలకు లోనై తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల జీవితంలో తీవ్ర పరిణామాలు చోటు చేసుకునే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో అకడమిక్ కోఆర్డినేటర్ బత్తిని నాగరాజు, అసోసియేట్ ప్రొఫెసర్ మెరెడ్డి శ్రీనివాసరెడ్డి, పరీక్షల నియంత్రణ అధికారి డా. మునుస్వామి, ఎన్‌ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారులు ఎన్. కోటయ్య, ఎం. వెంకటరెడ్డి, కంబాలపల్లి శివరాణి, డా. అదే మల్లేశం, డా. బొజ్జ అనిల్ కుమార్, ఎం. సావిత్రితో పాటు బోధన, బోధనేతర సిబ్బంది మరియు విద్యార్థులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News