వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు విధానాలు మార్చుకోవాలి: వ్యవసాయ శాఖ
వాతావరణ మార్పులకు అనుగుణంగా సాగు విధానాలు మార్చుకోవాలి: వ్యవసాయ శాఖ
Krishna
నారాయణఖేడ్ నియోజకవర్గంలోని కంగ్టి మండల పరిధిలోని చాప్టా(కె) గ్రామంలో వ్యవసాయ విస్తరణ అధికారి హన్మండ్లు రైతులకు వాతావరణ పరిస్థితులకు అనుగుణంగా చేపట్టాల్సిన వ్యవసాయ చర్యలపై అవగాహన కల్పించారు. ఎల్నినో ప్రభావంతో మండలంలో వర్షాభావ పరిస్థితులు కనిపిస్తున్నందున వరికి బదులుగా జొన్న, సజ్జ, పెసర, మినుము వంటి తక్కువ నీటి అవసరమయ్యే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేయాలని సూచించారు. ప్రస్తుతం సాగులో ఉన్న పంటలకు వర్షాలు కురిసే వరకు నేరుగా ఎరువులు వేయకుండా, 19-19-19 ఎరువును లీటరు నీటికి 5 గ్రాముల చొప్పున కలిపి పిచికారీ చేయాలని తెలిపారు. అలాగే ప్రకృతి వ్యవసాయం, నీటి పొదుపు పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తూ డ్రిప్ సాగు ద్వారా తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో సాగు చేయవచ్చని వివరించారు. డ్రిప్ పద్ధతికి ప్రభుత్వ సబ్సిడీ అందుబాటులో ఉందని, బోరు బావులు కలిగిన రైతులు మీ సేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకుని సంబంధిత అధికారులను సంప్రదించాలని సూచించారు. సన్నరకాల వరి విత్తనాలు కొనుగోలు చేసిన రైతులు తమ వరి రకాలను డీలర్ల వద్ద నమోదు చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శివాజీ పాటిల్, రైతులు అశోక్, శ్రీకాంత్, అశోక్ స్వామి, నాగ్గొండ తదితరులు పాల్గొన్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి