Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జీవో 97ను వెంటనే రద్దు చేయాలి అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 12:21 AM

వన్యప్రాణి వేట: ముగ్గురిపై కేసు నమోదు

వన్యప్రాణి వేట: ముగ్గురిపై కేసు నమోదు

వన్యప్రాణి వేట: ముగ్గురిపై కేసు నమోదు
04-03-2026 88 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిధిలోని వేమనపల్లి మండలంలో వన్యప్రాణి వేట ఘటన వెలుగులోకి వచ్చింది. నీల్వాయి రేంజ్‌కు చెందిన అటవీ అధికారులు మంగళవారం అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి, వండిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.

క్యాతనపల్లి గ్రామ శివారులోని పెద్దవాగు రెవెన్యూ భూమిలో విద్యుత్ తీగలు అమర్చి వన్యప్రాణిని వేటాడినట్లు నిందితులు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై నెందుగూరి నారాయణ, గురుంద్ల వసంత్, నిక్కురి బాపు అనే ముగ్గురిపై వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.

ఈ దాడుల్లో ఎఫ్‌ఆర్‌ఓ హఫీజుద్ధీన్, డిఆర్‌ఓ ప్రమోద్ కుమార్, ఎఫ్‌బిఓ మహిపాల్‌తో పాటు నీల్వాయి బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు వన్యప్రాణి వేటకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

Sthanikam

వన్యప్రాణి వేట: ముగ్గురిపై కేసు నమోదు

Article Image

మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పరిధిలోని వేమనపల్లి మండలంలో వన్యప్రాణి వేట ఘటన వెలుగులోకి వచ్చింది. నీల్వాయి రేంజ్‌కు చెందిన అటవీ అధికారులు మంగళవారం అనుమానితుల ఇళ్లలో సోదాలు నిర్వహించి, వండిన మాంసాన్ని స్వాధీనం చేసుకున్నారు.

క్యాతనపల్లి గ్రామ శివారులోని పెద్దవాగు రెవెన్యూ భూమిలో విద్యుత్ తీగలు అమర్చి వన్యప్రాణిని వేటాడినట్లు నిందితులు అంగీకరించినట్లు అధికారులు తెలిపారు.

ఈ ఘటనపై నెందుగూరి నారాయణ, గురుంద్ల వసంత్, నిక్కురి బాపు అనే ముగ్గురిపై వైల్డ్ లైఫ్ ప్రొటెక్షన్ యాక్ట్ 1972 ప్రకారం కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు.

ఈ దాడుల్లో ఎఫ్‌ఆర్‌ఓ హఫీజుద్ధీన్, డిఆర్‌ఓ ప్రమోద్ కుమార్, ఎఫ్‌బిఓ మహిపాల్‌తో పాటు నీల్వాయి బేస్ క్యాంప్ సిబ్బంది పాల్గొన్నారు. అధికారులు వన్యప్రాణి వేటకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News