ఎల్ బీ నగర్ నియోజకవర్గం
వనస్థలిపురం డివిజన్ పరిధిలోని గురుద్వారా రోడ్డు ప్రధాన రహదారి వద్ద ముదబ్బీర్ అలీ ఖాన్ ఆధ్వర్యంలో గ్రాండ్ ఇఫ్తార్ విందు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి హాజరై ముస్లిం సోదరులతో కలిసి ఇఫ్తార్లో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా అయాన మాట్లాడుతూ రంజాన్ మాసం పరస్పర ప్రేమ, సౌభ్రాతృత్వానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ పండుగలను సామరస్య వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో మాజీ కార్పొరేటర్ జిట్టా రాజశేఖర్ రెడ్డి, వనస్థలిపురం డివిజన్ భారస పార్టీ అధ్యక్షులు చింతల రవికుమార్, మధు గౌడ్, నవీద్, సంజయ్, కిషోర్ కుమార్ తదితర భారస నాయకులు, ముస్లిం పెద్దలు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి