వనస్థలిపురంలో గౌతమ్ పబ్లిక్ స్కూల్ లో వార్షికోత్సవ వేడుకలు
వనస్థలిపురంలో గౌతమ్ పబ్లిక్ స్కూల్ లో వార్షికోత్సవ వేడుకలు
RAPOLU LINGASWAMY
విద్యార్థుల ప్రతిభను వెలికితీసి వారి కలలకు నూతన దిశనిచ్చే లక్ష్యంతో గౌతమ్ పబ్లిక్ స్కూల్ ఆధ్వర్యంలో వార్షిక దినోత్సవ వేడుకలు - 2026 (క్విన్టెసెన్స్) వార్షికోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల ప్రతిభను ప్రతిబింబించేలా నిర్వహించిన ఈ కార్యక్రమం అందరిని ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా నేలపాటి రామారావు హైదరాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీ.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమని ప్రారంభించి విద్యార్థులను అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యతో పాటు సాంస్కృతిక కార్యక్రమాలు విద్యార్థులలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమానికీ బైరిడ్డి శ్రీనుమిట్టీ కాలేజ్ ఛైర్మన్,డి.భీక్షపతి ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సెంట్రల్ క్రైమ్ స్టేషన్,జి.వెంకటేశ్వర్ రెడ్డి ఎ.సి.పి సి.సి.ఎస్, దీపావళి శ్రవణ్, దీపావళి శ్రీకాంత్, గౌరవ అతిథులుగా పాల్గొని విద్యార్థులను ప్రోత్సహించారు.మరియు ఎ.సి.పి ఉదం సింగ్ మూవీ టీమ్ హీరో, హీరోయిన్, డైరెక్టర్, నిర్మాత పాల్గొని సినిమా గ్లింప్స్ రిలీజ్ చేసి పిల్లాలా ఆట పాటలని ఎంతగానో కొనియాడారు.
ఈ సందర్భంగా విద్యార్థులు నృత్యాలు, సంగీత ప్రదర్శనలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ప్రేక్షకులను అలరించారు. విద్యా, క్రీడా రంగాలలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు.
ఈ కార్యక్రమం లో గౌతమ్ స్కూల్ చైర్మన్ వెంకట శ్రవణ్, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి