Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 11:11 PM

వైద్య సేవలు మెరుగుపరచాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశం

వైద్య సేవలు మెరుగుపరచాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశం

వైద్య సేవలు మెరుగుపరచాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశం
13-03-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

వంగపల్లి పీహెచ్‌సీపై ఆకస్మిక తనిఖీ

యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, వైద్య సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న చికిత్స, మందుల లభ్యత వంటి అంశాలను పరిశీలించారు.

ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని, గడువు ముగిసిన మందులను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అలాగే ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించాలని సూచించారు. గర్భిణీ స్త్రీలకు అందుతున్న వైద్య సేవలు, వారికి అందిస్తున్న సౌకర్యాలపై కూడా ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

Sthanikam

వైద్య సేవలు మెరుగుపరచాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశం

Article Image

వంగపల్లి పీహెచ్‌సీపై ఆకస్మిక తనిఖీ

యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, వైద్య సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న చికిత్స, మందుల లభ్యత వంటి అంశాలను పరిశీలించారు.

ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని, గడువు ముగిసిన మందులను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

అలాగే ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించాలని సూచించారు. గర్భిణీ స్త్రీలకు అందుతున్న వైద్య సేవలు, వారికి అందిస్తున్న సౌకర్యాలపై కూడా ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News