వైద్య సేవలు మెరుగుపరచాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశం
వైద్య సేవలు మెరుగుపరచాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు ఆదేశం
స్థానికం బృందం
వంగపల్లి పీహెచ్సీపై ఆకస్మిక తనిఖీ
యాదగిరిగుట్ట మండలం వంగపల్లి గ్రామంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ భాస్కర్ రావు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలు, వైద్య సిబ్బంది హాజరు, రోగులకు అందుతున్న చికిత్స, మందుల లభ్యత వంటి అంశాలను పరిశీలించారు.
ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయన సూచించారు. అవసరమైన మందులు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉండేలా చూడాలని, గడువు ముగిసిన మందులను వెంటనే తొలగించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
అలాగే ఆసుపత్రి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి, రోగులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా సేవలు అందించాలని సూచించారు. గర్భిణీ స్త్రీలకు అందుతున్న వైద్య సేవలు, వారికి అందిస్తున్న సౌకర్యాలపై కూడా ఆయన వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి