విద్యాభివృద్ధే లక్ష్యం – బోల్లేపల్లి జెడ్పీ హైస్కూల్కు రూ.15 లక్షల నిధులు సాధించిన ఎంపీ బోల్లేపల్లి జెడ్పీ హైస్కూల్కు రూ.15 లక్షల నిధులు మంజూరు -ఎ
విద్యాభివృద్ధే లక్ష్యం – బోల్లేపల్లి జెడ్పీ హైస్కూల్కు రూ.15 లక్షల నిధులు సాధించిన ఎంపీ బోల్లేపల్లి జెడ్పీ హైస్కూల్కు రూ.15 లక్షల నిధులు మంజూరు -ఎ
Editor Desk
బోల్లేపల్లి జెడ్పీ హైస్కూల్కు రూ.15 లక్షల నిధులు మంజూరు
-ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ నేతల కృతజ్ఞతలు
భువనగిరి స్థానికం ప్రతినిధి
భువనగిరి మండల పరిధిలోని బోల్లేపల్లి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మరమ్మతుల కోసం రూ.15 లక్షల నిధులు మంజూరు చేయించిన భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డికి జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.ఈ సందర్భంగా ఎంపీ గారిని కలిసి కృతజ్ఞతలు తెలియజేసిన వారిలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు కనకుంట్ల బాబు రావు,భువనగిరి మాజీ వైస్ ఎం.పీ.పీ.మోడెపు శ్రీనివాస్ గౌడ్,నల్గొండ ప్రభాకర్,కాశీ నాయక్తో పాటు గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులు,కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఈ నిధుల మంజూరుతో పాఠశాల అభివృద్ధి చెందడంతో పాటు విద్యార్థులకు మెరుగైన వసతులు అందుబాటులోకి వస్తాయని వారు పేర్కొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి