యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక గ్రామంలో ఈదురుగాలులు, అకాల వర్షం కారణంగా విరిగి రోడ్డుకు అడ్డంగా పడిన చెట్టును గ్రామ సర్పంచ్ గట్టు నరసింహ ఆధ్వర్యంలో తొలగించారు.
గురువారం రాత్రి కురిసిన వడగండ్ల వాన, ఈదురుగాలులకు చెట్టు విరిగి ప్రధాన రహదారిపై పడటంతో వాహనదారులు, గ్రామస్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ వెంటనే స్పందించి కార్మికులతో కలిసి చెట్టును తొలగించే పనులు చేపట్టారు.
దీంతో రాకపోకలు మళ్లీ సాధారణ స్థితికి చేరుకున్నాయి. గ్రామస్తులు సర్పంచ్ స్పందనను అభినందించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి