మిషన్ భగీరథ కార్మికుల ఆందోళన
మిషన్ భగీరథ కార్మికుల ఆందోళన
Editor Desk
పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు మంగళవారం జిల్లా కేంద్రంలోని పానగల్లో ఉన్న మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం ముందు బీఆర్టీయూ, ఏఐటీయూసీ సంఘాల ఆధ్వర్యంలో సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.
ఈ సందర్భంగా ఆర్డీయూ సంఘం నాయకుడు నిమ్మనగోటి శీను మాట్లాడుతూ, ఐదు నెలలుగా పెండింగ్లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేసి, పనికి తగిన వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరల నేపథ్యంలో ప్రస్తుతం అందుతున్న జీతాలు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
పెట్రోల్ ధరలు పెరగడంతో అదనపు ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నామని, పిల్లల చదువుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేవలం రూ.13 వేల వేతనంతో కుటుంబ పోషణ సాధ్యం కాదని పేర్కొన్నారు.
ప్రభుత్వం స్పందించి కార్మికుల వేతనాలను పెంచడంతో పాటు, కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరారు.
ఈ నిరసన కార్యక్రమంలో తంతనాల దయాకర్, ఫయాజుద్దీన్, జలంధర్, సతీష్, నాగరాజు, వెంకన్న, మహేష్, వెంకట్ రెడ్డి, రఘుపతి, ఫ్రాన్సిస్ తదితర కార్మికులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి