Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:50 AM

మిషన్ భగీరథ కార్మికుల ఆందోళన

మిషన్ భగీరథ కార్మికుల ఆందోళన

మిషన్ భగీరథ కార్మికుల ఆందోళన
27-05-2026 25 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు మంగళవారం జిల్లా కేంద్రంలోని పానగల్‌లో ఉన్న మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం ముందు బీఆర్టీయూ, ఏఐటీయూసీ సంఘాల ఆధ్వర్యంలో సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఆర్డీయూ సంఘం నాయకుడు నిమ్మనగోటి శీను మాట్లాడుతూ, ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేసి, పనికి తగిన వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరల నేపథ్యంలో ప్రస్తుతం అందుతున్న జీతాలు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పెట్రోల్ ధరలు పెరగడంతో అదనపు ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నామని, పిల్లల చదువుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేవలం రూ.13 వేల వేతనంతో కుటుంబ పోషణ సాధ్యం కాదని పేర్కొన్నారు.

ప్రభుత్వం స్పందించి కార్మికుల వేతనాలను పెంచడంతో పాటు, కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో తంతనాల దయాకర్, ఫయాజుద్దీన్, జలంధర్, సతీష్, నాగరాజు, వెంకన్న, మహేష్, వెంకట్ రెడ్డి, రఘుపతి, ఫ్రాన్సిస్ తదితర కార్మికులు పాల్గొన్నారు.

Sthanikam

మిషన్ భగీరథ కార్మికుల ఆందోళన

Article Image

పెండింగ్ వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మిషన్ భగీరథ కార్మికులు మంగళవారం జిల్లా కేంద్రంలోని పానగల్‌లో ఉన్న మిషన్ భగీరథ నీటి శుద్ధి కేంద్రం ముందు బీఆర్టీయూ, ఏఐటీయూసీ సంఘాల ఆధ్వర్యంలో సంయుక్తంగా నిరసన కార్యక్రమం చేపట్టారు.

ఈ సందర్భంగా ఆర్డీయూ సంఘం నాయకుడు నిమ్మనగోటి శీను మాట్లాడుతూ, ఐదు నెలలుగా పెండింగ్‌లో ఉన్న వేతనాలను తక్షణమే విడుదల చేసి, పనికి తగిన వేతనం చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పెరిగిన నిత్యావసర సరుకుల ధరల నేపథ్యంలో ప్రస్తుతం అందుతున్న జీతాలు సరిపోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

పెట్రోల్ ధరలు పెరగడంతో అదనపు ఆర్థిక భారాన్ని ఎదుర్కొంటున్నామని, పిల్లల చదువుల కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందన్నారు. కేవలం రూ.13 వేల వేతనంతో కుటుంబ పోషణ సాధ్యం కాదని పేర్కొన్నారు.

ప్రభుత్వం స్పందించి కార్మికుల వేతనాలను పెంచడంతో పాటు, కాంట్రాక్టర్ల ప్రమేయం లేకుండా నేరుగా కార్మికుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయాలని కోరారు.

ఈ నిరసన కార్యక్రమంలో తంతనాల దయాకర్, ఫయాజుద్దీన్, జలంధర్, సతీష్, నాగరాజు, వెంకన్న, మహేష్, వెంకట్ రెడ్డి, రఘుపతి, ఫ్రాన్సిస్ తదితర కార్మికులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News