ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టిప్పర్ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి తీవ్ర ఉత్కంఠ
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టిప్పర్ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి తీవ్ర ఉత్కంఠ
Editor Desk
హైదరాబాద్: హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. మెడ్చల్ నుంచి ఆటోనగర్ వైపు వెళ్తున్న కిరాణా సరుకులతో నిండిన లారీ టైరు పగిలి అదుపుతప్పడంతో ప్రమాదం చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. RJ 10 GA 8723 నంబరు గల లారీ ఉదయం సుమారు 4 గంటల సమయంలో కెప్టెన్ కుక్ సమీపానికి చేరుకోగానే టైరు పేలింది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయిన వాహనం రోడ్డు డివైడర్ను ఢీకొట్టింది. అదే సమయంలో వెనుక నుంచి వస్తున్న TG07 W 2459 నంబరు గల టిప్పర్ లారీ ముందున్న లారీని బలంగా ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ నవీన్ తీవ్రంగా గాయపడి క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. భారీ శ్రమతో డ్రైవర్ను బయటికి తీసి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు.
ప్రమాదం కారణంగా కొంతసేపు జాతీయ రహదారిపై ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి