ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టిప్పర్ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి తీవ్ర ఉత్కంఠ
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన టిప్పర్ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయి తీవ్ర ఉత్కంఠ
Editor Desk
అబ్దుల్లాపూర్మెట్: హయత్నగర్ పోలీస్ స్టేషన్ ఎదురుగా జాతీయ రహదారిపై మంగళవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదం తీవ్ర కలకలం రేపింది. టైరు పగిలి రోడ్డుపై ఆగి ఉన్న లారీని వెనుక నుంచి వస్తున్న టిప్పర్ లారీ ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో టిప్పర్ డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోగా, జాతీయ రహదారిపై కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
జేసీబీ సహాయంతో దాదాపు రెండు గంటల పాటు శ్రమించి క్యాబిన్లో ఇరుక్కున్న డ్రైవర్ను సురక్షితంగా బయటికి తీశారు. ప్రమాద సమయంలో డ్రైవర్ ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని విలవిల్లాడగా, పోలీసులు, ఫైర్ సిబ్బంది చాకచక్యంగా స్పందించి అతడిని రక్షించారు.
డ్రైవర్కు స్వల్ప గాయాలు మాత్రమే కావడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి