Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:57 AM

వడ్లకు మంట.. రైతన్నకు కంటతడి! రెండు నెలలుగా కొనుగోళ్లు నత్తనడకన.. ఆగ్రహంతో బస్తాలు తగలబెట్టిన రైతులు

వడ్లకు మంట.. రైతన్నకు కంటతడి! రెండు నెలలుగా కొనుగోళ్లు నత్తనడకన.. ఆగ్రహంతో బస్తాలు తగలబెట్టిన రైతులు

వడ్లకు మంట.. రైతన్నకు కంటతడి!  రెండు నెలలుగా కొనుగోళ్లు నత్తనడకన.. ఆగ్రహంతో బస్తాలు తగలబెట్టిన రైతులు
30-05-2026 179 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఒకవైపు అకాల వర్షాలు.. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం.. రైతన్నను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆవేదనను తెలియజేస్తూ రోడ్డుపై వడ్ల బస్తాలకు నిప్పంటించి నిరసన చేపట్టారు.

రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు నెలల క్రితం కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసినా ఇప్పటి వరకు కేవలం 17 లారీల ధాన్యాన్ని మాత్రమే తరలించారని, ఇంకా సుమారు 50 లారీల ధాన్యం కల్లాల్లోనే పేరుకుపోయి ఉందని వాపోయారు. ఈ క్రమంలో కురిసిన అకాల వర్షాలకు ధాన్యం పలుమార్లు తడవడంతో నాలుగు సార్లు ఆరబోయాల్సి వచ్చిందని, దీంతో అదనపు ఖర్చులతో పాటు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద కాపలా కాస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. లారీలను తగిన సంఖ్యలో పంపడం లేదని, ధాన్యాన్ని అధిక తూకం వేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వెంటనే తాసిల్దార్ జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో రైతులు క్యాస వీరాస్వామి, బైరోజు ధనంజయ్య, గుండాల రాంబాబు, సల్ల బిక్షం, మల్లారెడ్డి, అంజయ్య, గుండాల మల్లయ్య, గంగని చింటు, సాయి శేఖర్, నీలా మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

వడ్లకు మంట.. రైతన్నకు కంటతడి! రెండు నెలలుగా కొనుగోళ్లు నత్తనడకన.. ఆగ్రహంతో బస్తాలు తగలబెట్టిన రైతులు

Article Image

ఒకవైపు అకాల వర్షాలు.. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం.. రైతన్నను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆవేదనను తెలియజేస్తూ రోడ్డుపై వడ్ల బస్తాలకు నిప్పంటించి నిరసన చేపట్టారు.

రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు నెలల క్రితం కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసినా ఇప్పటి వరకు కేవలం 17 లారీల ధాన్యాన్ని మాత్రమే తరలించారని, ఇంకా సుమారు 50 లారీల ధాన్యం కల్లాల్లోనే పేరుకుపోయి ఉందని వాపోయారు. ఈ క్రమంలో కురిసిన అకాల వర్షాలకు ధాన్యం పలుమార్లు తడవడంతో నాలుగు సార్లు ఆరబోయాల్సి వచ్చిందని, దీంతో అదనపు ఖర్చులతో పాటు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద కాపలా కాస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. లారీలను తగిన సంఖ్యలో పంపడం లేదని, ధాన్యాన్ని అధిక తూకం వేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వెంటనే తాసిల్దార్ జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో రైతులు క్యాస వీరాస్వామి, బైరోజు ధనంజయ్య, గుండాల రాంబాబు, సల్ల బిక్షం, మల్లారెడ్డి, అంజయ్య, గుండాల మల్లయ్య, గంగని చింటు, సాయి శేఖర్, నీలా మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News