Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణలో అధికారులు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 03:16 AM

వడ్లకు మంట.. రైతన్నకు కంటతడి! రెండు నెలలుగా కొనుగోళ్లు నత్తనడకన.. ఆగ్రహంతో బస్తాలు తగలబెట్టిన రైతులు

వడ్లకు మంట.. రైతన్నకు కంటతడి! రెండు నెలలుగా కొనుగోళ్లు నత్తనడకన.. ఆగ్రహంతో బస్తాలు తగలబెట్టిన రైతులు

వడ్లకు మంట.. రైతన్నకు కంటతడి!  రెండు నెలలుగా కొనుగోళ్లు నత్తనడకన.. ఆగ్రహంతో బస్తాలు తగలబెట్టిన రైతులు
May 30, 2026 10:45 AM 140 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

ఒకవైపు అకాల వర్షాలు.. మరోవైపు అధికారుల నిర్లక్ష్యం.. రైతన్నను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం దుబ్బాక మార్కెట్‌లో ధాన్యం కొనుగోళ్లలో జరుగుతున్న జాప్యంపై రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ఆవేదనను తెలియజేస్తూ రోడ్డుపై వడ్ల బస్తాలకు నిప్పంటించి నిరసన చేపట్టారు.

రైతులు తెలిపిన వివరాల ప్రకారం.. రెండు నెలల క్రితం కొనుగోలు కేంద్రంలో వడ్లు పోసినా ఇప్పటి వరకు కేవలం 17 లారీల ధాన్యాన్ని మాత్రమే తరలించారని, ఇంకా సుమారు 50 లారీల ధాన్యం కల్లాల్లోనే పేరుకుపోయి ఉందని వాపోయారు. ఈ క్రమంలో కురిసిన అకాల వర్షాలకు ధాన్యం పలుమార్లు తడవడంతో నాలుగు సార్లు ఆరబోయాల్సి వచ్చిందని, దీంతో అదనపు ఖర్చులతో పాటు తీవ్ర నష్టం వాటిల్లిందని ఆవేదన వ్యక్తం చేశారు.

రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద కాపలా కాస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు మండిపడ్డారు. లారీలను తగిన సంఖ్యలో పంపడం లేదని, ధాన్యాన్ని అధిక తూకం వేస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఆరోపించారు. వెంటనే తాసిల్దార్ జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు.కార్యక్రమంలో రైతులు క్యాస వీరాస్వామి, బైరోజు ధనంజయ్య, గుండాల రాంబాబు, సల్ల బిక్షం, మల్లారెడ్డి, అంజయ్య, గుండాల మల్లయ్య, గంగని చింటు, సాయి శేఖర్, నీలా మల్లయ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News