Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 02, 2026 02:22 AM

వడగళ్లతో భారీ వర్షం… రైతులకు నష్టం

వడగళ్లతో భారీ వర్షం… రైతులకు నష్టం

వడగళ్లతో భారీ వర్షం… రైతులకు నష్టం
April 19, 2026 04:47 PM 104 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం… మరికొన్ని చోట్ల ఎండల తీవ్రత

హైదరాబాద్‌,

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లో ఈదురుగాలులతో వర్షం దంచికొట్టింది. ఆకస్మికంగా కురిసిన వర్షంతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఊరట లభించింది.

అయితే అకాల వర్షం రైతులకు మాత్రం నష్టాన్ని మిగిల్చింది. కల్లాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలపైనా ప్రభావం పడే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఒకవైపు వర్షాలు, మరోవైపు మండుతున్న ఎండలతో వాతావరణంలో విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News