Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
బ్రహ్మోత్సవాల్లో స్థానిక కళాకారులకు అవకాశాలు ఇవ్వాలి. సిపిఐ – ఈవోకు వినతి పత్రం ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! మాజీ మంత్రి పల్లె ని కలిసిన టీడీపీ అధ్యక్షురాలు పర్వీన్ భాను ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 19, 2026 06:58 PM

వడగళ్లతో భారీ వర్షం… రైతులకు నష్టం

వడగళ్లతో భారీ వర్షం… రైతులకు నష్టం

వడగళ్లతో భారీ వర్షం… రైతులకు నష్టం
April 19, 2026 04:47 PM 61 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం… మరికొన్ని చోట్ల ఎండల తీవ్రత

హైదరాబాద్‌,

తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్‌, కామారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లో ఈదురుగాలులతో వర్షం దంచికొట్టింది. ఆకస్మికంగా కురిసిన వర్షంతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఊరట లభించింది.

అయితే అకాల వర్షం రైతులకు మాత్రం నష్టాన్ని మిగిల్చింది. కల్లాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలపైనా ప్రభావం పడే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఇదిలా ఉండగా రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఒకవైపు వర్షాలు, మరోవైపు మండుతున్న ఎండలతో వాతావరణంలో విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News