కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులతో వర్షం… మరికొన్ని చోట్ల ఎండల తీవ్రత
హైదరాబాద్,
తెలంగాణలోని పలు జిల్లాల్లో ఆదివారం వడగళ్లతో కూడిన భారీ వర్షం కురిసింది. రాజన్న సిరిసిల్ల, నిజామాబాద్, కామారెడ్డి జిల్లాల్లోని పలు మండలాల్లో ఈదురుగాలులతో వర్షం దంచికొట్టింది. ఆకస్మికంగా కురిసిన వర్షంతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఊరట లభించింది.
అయితే అకాల వర్షం రైతులకు మాత్రం నష్టాన్ని మిగిల్చింది. కల్లాల్లో నిల్వ ఉంచిన ధాన్యం తడిచిపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కోతకు సిద్ధంగా ఉన్న పంటలపైనా ప్రభావం పడే అవకాశముందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇదిలా ఉండగా రాష్ట్రంలోని మరికొన్ని జిల్లాల్లో ఎండల తీవ్రత కొనసాగుతోంది. ఒకవైపు వర్షాలు, మరోవైపు మండుతున్న ఎండలతో వాతావరణంలో విభిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి