PRINT TIME: February 24, 2026 04:22 AM
వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేణుగోపాల స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక పూజలు
వైకుంఠ ఏకాదశి సందర్భంగా వేణుగోపాల స్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య ప్రత్యేక పూజలు
December 30, 2025 11:36 AM
88 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం
నార్కట్ పల్లి స్థానికం ప్రతినిధి
వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని నార్కట్పల్లి పట్టణ కేంద్రంలోని వేణుగోపాల స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్వామివారిని దర్శించుకొని పూజల్లో పాల్గొన్నారు. ఉత్తర ద్వార దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం భక్తిశ్రద్ధలతో కిటకిటలాడగా, వేద మంత్రోచ్చారణలు పర్వదిన శోభను మరింత పెంచాయి. ఆలయ కమిటీ ఏర్పాట్లు సమర్థవంతంగా నిర్వహించగా, భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చర్యలు తీసుకున్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి