PRINT TIME: April 11, 2026 09:51 AM
వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామిని దర్శించిన మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్
January 01, 2026 01:14 PM
22 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
స్థానిక ప్రతినిధి ఎన్ కుమార్
వైకుంఠ ఏకాదశి మహా పర్వదినాన్ని పురస్కరించుకొని తెలంగాణ శాసనసభ్యుడు, బీసీ సంక్షేమ మరియు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు శుక్రవారం ఉదయం స్వర్ణగిరి వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రంలో కుటుంబ సమేతంగా ప్రత్యేక దర్శనం చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆలయ వ్యవస్థాపకులు శ్రీ మానేపల్లి రామారావు, శ్రీ మురళీకృష్ణ గార్లు, ఆలయ అర్చకులు మంత్రివర్యులను ఘనంగా స్వాగతించి ఆలయానికి ఆహ్వానించారు. అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దంపతులు స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో దర్శించుకున్నారు.
తదుపరి ఆలయంలోని జల నారాయణ స్వామి వారిని దర్శించుకున్న మంత్రివర్యులకు అర్చకులు వేద ఆశీర్వచనం నిర్వహించారు. అనంతరం ఆలయ వ్యవస్థాపకులు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ దంపతులకు లడ్డు ప్రసాదాన్ని అందజేశారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి