ఉస్మానియా మసీదులో ఘనంగా ఇఫ్తార్ విందు
ఉస్మానియా మసీదులో ఘనంగా ఇఫ్తార్ విందు
స్థానికం బృందం
మత సామరస్యానికి నిదర్శనంగా కార్యక్రమం
హుజూర్నగర్: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని హుజూర్నగర్ పట్టణంలోని ఉస్మానియా మసీదులో ముస్లిం యువకులు ఘనంగా ఇఫ్తార్ విందును ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి నూతనంగా ఎన్నికైన మున్సిపల్ చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్ ముఖ్య అతిథులుగా హాజరై ముస్లిం సోదరులతో కలిసి ఉపవాస విరమణ చేశారు.
ఈ సందర్భంగా చైర్మన్ దొంతగాని శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ రంజాన్ మాసం పవిత్రత, ఉపవాస దీక్షల ద్వారా మనుషుల్లో సహనం, సేవాభావం, సోదరభావం పెరుగుతాయని అన్నారు. ముస్లిం సోదరులు పాటిస్తున్న ఉపవాసాలు సమాజానికి ఐక్యత, శాంతి, పరస్పర గౌరవం అనే సందేశాన్ని ఇస్తాయని పేర్కొన్నారు. అన్ని మతాల ప్రజలు పరస్పర గౌరవంతో కలిసిమెలిసి జీవించడం సమాజ అభివృద్ధికి ఎంతో అవసరమని తెలిపారు.
మున్సిపల్ వైస్ చైర్మన్ తన్నీరు మల్లికార్జున్ మాట్లాడుతూ రంజాన్ మాసం ప్రేమ, సహనం, పరస్పర గౌరవాన్ని పెంపొందించే పవిత్రమైన నెల అని అన్నారు. ఇలాంటి ఇఫ్తార్ విందులు సమాజంలో మత సామరస్యాన్ని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు.
ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గెల్లి రవి, వర్కింగ్ ప్రెసిడెంట్ సుంకరి శివరాం యాదవ్, మూడో వార్డు కౌన్సిలర్ సులువ చంద్రశేఖర్, 19వ వార్డు కౌన్సిలర్ వల్లపుదాసు కృష్ణ, 6వ వార్డు కౌన్సిలర్ శీలం శీను, ప్రజాప్రతినిధులు సయ్యద్ రఫీ, బాజీ ఉల్లా, షేక్ జానీ పాషా, మ్యారేజ్ బ్యూరో మజీద్, మొహమ్మద్ యాసిన్, అలీ రజాలి, బాబా షఫీ, అజార్, సోహెల్, గౌస్, సలీం, ముఖిద్, ఇమ్రాన్, సమీర్, సైఫ్, అయ్యుబ్, నాగుల్ మీరా, నసీర్, రషీద్ తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో ముస్లిం యువకులు, స్థానిక నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి