ఉరవకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ కలకలం
ఉరవకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ కలకలం
GADDAM JAGANMOHAN REDDY
అనంతపురం జిల్లాలోని ఉరవకొండ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన భూమి రిజిస్ట్రేషన్లలో అక్రమాలు జరిగినట్లు ఫిర్యాదులు అందడంతో జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం అప్రమత్తమైంది. గతంలో జరిగిన రెండు ముఖ్యమైన భూ నమోదు పత్రాలు నకిలీగా నమోదు అయ్యాయని ప్రాథమిక ఆధారాలు లభించడంతో ఈ వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణకు ఆదేశాలు జారీ అయ్యాయి.
పది సంవత్సరాల క్రితం జరిగిన పత్రాలపై ఫిర్యాదు
ఉరవకొండకు చెందిన ఎం. మధుబాబు (తండ్రి: ఎం. నాగేంద్ర) తన భూమికి సంబంధించిన 2264/2012 మరియు 2619/2016 సంఖ్యలతో ఉన్న అమ్మకపు పత్రాలు నకిలీగా, మోసపూరితంగా నమోదు అయ్యాయని గత ఏడాది డిసెంబర్ 27న అధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును జిల్లా నమోదుదారు తీవ్రంగా పరిగణించి చట్టం ప్రకారం విచారణ ప్రారంభించారు.
నిందితులకు నోటీసులు
ఈ వ్యవహారంలో సంబంధం ఉన్నట్లు భావిస్తున్న ఆరుగురు వ్యక్తులకు జిల్లా రిజిస్ట్రార్ కార్యాలయం నోటీసులు జారీ చేసింది. వీరిలో
గుర్రం నారాయణ స్వామి (సొల్లపురం),
కొమ్మసాని బాలచంద్ర (ఉరవకొండ),
మంగళ విశ్వనాథ్ (పెద్దకౌకుంట్ల),
మీనుగ బసవరాజు (ఉరవకొండ),
రాయల భీమన్న (ఉరవకొండ) తదితరులు ఉన్నారు.
వీరంతా అనంతపురంలోని జిల్లా నమోదుదారు కార్యాలయంలో జరిగే విచారణకు హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు. వారు స్వయంగా గానీ లేదా తమ తరఫు న్యాయవాదుల ద్వారా గానీ హాజరై సంబంధిత పత్రాలు సమర్పించాలని అధికారులు ఆదేశించారు.
హాజరు కాకపోతే ఏకపక్ష నిర్ణయం
నోటీసులు అందుకున్న వారు నిర్ణీత సమయానికి విచారణకు హాజరుకాకపోతే ఫిర్యాదు దారుడు సమర్పించిన ఆధారాల ఆధారంగా ఏకపక్షంగా నిర్ణయం తీసుకుని తదుపరి చర్యలు చేపడతామని జిల్లా రిజిస్ట్రార్ హెచ్చరించారు. ఈ వ్యవహారంపై ఉన్నతాధికారులకు కూడా సమాచారం పంపినట్లు తెలిసింది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి