ఉపాధి కూలీల సమస్యలపై సానిపల్లిలో వ్యవసాయ కార్మిక సంఘం ఆందోళన
ఉపాధి కూలీల సమస్యలపై సానిపల్లిలో వ్యవసాయ కార్మిక సంఘం ఆందోళన
EDIGA NAVEENKUMAR
శ్రీ సత్యసాయి జిల్లా రొద్దం మండలం సానిపల్లి గ్రామంలో ఈరోజు ఉపాధి కూలీల సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. పని ప్రదేశాన్ని సందర్శించిన ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కమిటీ సభ్యులు నారాయణ మాట్లాడుతూ, V.B.G.RAMG ఉపాధి పథకం వల్ల కూలీలకు నష్టం జరుగుతోందని ఆరోపించారు. పాత విధానంలోనే ఉపాధి హామీ చట్టాన్ని కొనసాగించాలని, ఇందుకు జరుగుతున్న నిరసన పోరాటాల్లో కూలీలు ఐక్యంగా పాల్గొనాలని పిలుపునిచ్చారు.
పేస్ యాప్ విధానాన్ని రద్దు చేయాలని, నాలుగు వారాలుగా పెండింగ్లో ఉన్న బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో కూలీలతో కలిసి ఎంపీడీవో కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు.
పని ప్రదేశాల్లో గడార్, పార, గంపలు, మజ్జిగ, మంచినీరు, మెడికల్ సదుపాయాలు కల్పించాలని, ఐదు కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే కూలీలకు రోజుకు రూ.20 నుంచి రూ.40 వరకు ఆటో ఛార్జీలు ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగప్ప, పి.సరస్వతి, కుమ్మరి లక్ష్మీదేవి, కె.అంజనప్ప, కుమ్మరి గంగమ్మ, ఆదిలక్ష్మమ్మ, రంగమ్మ, లక్ష్మమ్మ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి