Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యమకారుల మహాసభకు భారీ ఏర్పాట్లు. జోగు అంజన్న ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 17, 2026 06:01 PM

ఉపాధి హామీ కార్మికులకు బీమా కల్పించాలి.. కూలీ ₹800కు పెంపు డిమాండ్

ఉపాధి హామీ కార్మికులకు బీమా కల్పించాలి.. కూలీ ₹800కు పెంపు డిమాండ్

ఉపాధి హామీ కార్మికులకు బీమా కల్పించాలి.. కూలీ ₹800కు పెంపు డిమాండ్
April 17, 2026 04:25 PM 9 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బొమ్మలరామారం: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని మర్యాల గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.

ఎండాకాలంలో వడదెబ్బతో పాటు పని ప్రదేశాల్లో ప్రమాదాలకు గురై కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో మరణించిన కార్మికులకు కనీసం రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.

వ్యవసాయ రంగంలో మార్పుల వల్ల కూలీలకు సరిపడా పని దొరకడం లేదని, ఉపాధి హామీ పథకంలో సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని అన్నారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో రోజు కూలీని రూ.800కు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న ఆందోళనల్లో కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, కార్మికులు లత, నిర్మల, భాగ్య, ఉమారాణి, బాలమణి, అనురాధ, విజయ, కల్పన, సోగ్రాబి, బేగం, నర్సింహ, సునీత, పోచమ్మ, కవిత, ఇందిర, అమరావతి, యాదగిరి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News