ఉపాధి హామీ కార్మికులకు బీమా కల్పించాలి.. కూలీ ₹800కు పెంపు డిమాండ్
ఉపాధి హామీ కార్మికులకు బీమా కల్పించాలి.. కూలీ ₹800కు పెంపు డిమాండ్
Editor Desk
బొమ్మలరామారం: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని మర్యాల గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.
ఎండాకాలంలో వడదెబ్బతో పాటు పని ప్రదేశాల్లో ప్రమాదాలకు గురై కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో మరణించిన కార్మికులకు కనీసం రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.
వ్యవసాయ రంగంలో మార్పుల వల్ల కూలీలకు సరిపడా పని దొరకడం లేదని, ఉపాధి హామీ పథకంలో సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని అన్నారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో రోజు కూలీని రూ.800కు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న ఆందోళనల్లో కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, కార్మికులు లత, నిర్మల, భాగ్య, ఉమారాణి, బాలమణి, అనురాధ, విజయ, కల్పన, సోగ్రాబి, బేగం, నర్సింహ, సునీత, పోచమ్మ, కవిత, ఇందిర, అమరావతి, యాదగిరి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి