Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 09:55 PM

ఉపాధి హామీ కార్మికులకు బీమా కల్పించాలి.. కూలీ ₹800కు పెంపు డిమాండ్

ఉపాధి హామీ కార్మికులకు బీమా కల్పించాలి.. కూలీ ₹800కు పెంపు డిమాండ్

ఉపాధి హామీ కార్మికులకు బీమా కల్పించాలి.. కూలీ ₹800కు పెంపు డిమాండ్
April 17, 2026 04:25 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

బొమ్మలరామారం: ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న కార్మికులకు ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కొండమడుగు నర్సింహ్మ డిమాండ్ చేశారు. మండల పరిధిలోని మర్యాల గ్రామంలో ఉపాధి హామీ పనులను పరిశీలించిన అనంతరం ఆయన మాట్లాడారు.

ఎండాకాలంలో వడదెబ్బతో పాటు పని ప్రదేశాల్లో ప్రమాదాలకు గురై కార్మికులు ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వం నుంచి తగిన పరిహారం అందడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదాల్లో మరణించిన కార్మికులకు కనీసం రూ.10 లక్షల బీమా సౌకర్యం కల్పించాలని కోరారు.

వ్యవసాయ రంగంలో మార్పుల వల్ల కూలీలకు సరిపడా పని దొరకడం లేదని, ఉపాధి హామీ పథకంలో సంవత్సరానికి 200 రోజులు పని దినాలు కల్పించాలని అన్నారు. పెరుగుతున్న ధరల నేపథ్యంలో రోజు కూలీని రూ.800కు పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

డిమాండ్ల సాధన కోసం జరుగుతున్న ఆందోళనల్లో కార్మికులు పెద్దఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు.

ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు, కార్మికులు లత, నిర్మల, భాగ్య, ఉమారాణి, బాలమణి, అనురాధ, విజయ, కల్పన, సోగ్రాబి, బేగం, నర్సింహ, సునీత, పోచమ్మ, కవిత, ఇందిర, అమరావతి, యాదగిరి, లావణ్య తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News