ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ వద్ద నిరసన
ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కలెక్టరేట్ వద్ద నిరసన
RAPOLU LINGASWAMY
సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ టీజీఈజేఏసీ ఆధ్వర్యంలో శుక్రవారం హైదరాబాద్ జిల్లా కలెక్టరేట్ వద్ద భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఉద్యోగ, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని నాయకులు ఆరోపించారు.
ఈ సందర్భంగా డీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు సోమయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు, ఖాళీల భర్తీ, పెండింగ్ సమస్యల పరిష్కారంపై ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు వినోకుమార్, జిల్లా కార్యదర్శి మల్లయ్య మాట్లాడుతూ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలు రోజురోజుకూ పెరుగుతున్నాయని, వాటిపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. రాష్ట్ర ఉపాధ్యక్షురాలు రేణుక, నాయకులు సతీష్, అమృత మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ వర్గాల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం స్పష్టమైన హామీ ఇవ్వాలని డిమాండ్ చేశారు.
నిరసన కార్యక్రమంలో టీజీఈజేఏసీ, డీటీఎఫ్ నాయకులు, ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి