Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
అస్వస్థతతో ఉన్న స్వామిని పరామర్శించిన గొంగిడి సునిత ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 17, 2026 07:14 PM

ఉద్యోగుల డిమాండ్లపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

ఉద్యోగుల డిమాండ్లపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

ఉద్యోగుల డిమాండ్లపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
April 17, 2026 05:33 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జూన్ 2 నాటికి పిఆర్సి అమలు చేయాలి – జేఏసీ డిమాండ్

యాదగిరిగుట్ట: రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల పెండింగ్ డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టారు. తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా యాదగిరిగుట్టలో తాసిల్దార్ గణేష్ నాయక్‌కు వినతి పత్రం అందజేశారు.

జేఏసీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా జూన్ 2 నాటికి పిఆర్సి అమలు చేయాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ను అమల్లోకి తీసుకువచ్చి అందరికీ హెల్త్ కార్డులు జారీ చేయాలని తెలిపారు.

సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపిఎస్) పునరుద్ధరించాలని, 2004 సెప్టెంబర్ 1కు ముందు నియామకమైన ఉద్యోగులకు ఓపిఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, గత ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా 61 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు చేపట్టాలని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు నారాయణ, సైదారావు, యాదగిరి, రామ్మోహన్‌రావు, రాజు, దయాకర్‌రెడ్డి, రామ్మూర్తి, గడ్డమీది పాండురంగం, అక్బర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News