Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 09:53 PM

ఉద్యోగుల డిమాండ్లపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

ఉద్యోగుల డిమాండ్లపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు

ఉద్యోగుల డిమాండ్లపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
April 17, 2026 05:33 PM 30 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

జూన్ 2 నాటికి పిఆర్సి అమలు చేయాలి – జేఏసీ డిమాండ్

యాదగిరిగుట్ట: రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల పెండింగ్ డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టారు. తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా యాదగిరిగుట్టలో తాసిల్దార్ గణేష్ నాయక్‌కు వినతి పత్రం అందజేశారు.

జేఏసీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా జూన్ 2 నాటికి పిఆర్సి అమలు చేయాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్‌ను అమల్లోకి తీసుకువచ్చి అందరికీ హెల్త్ కార్డులు జారీ చేయాలని తెలిపారు.

సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపిఎస్) పునరుద్ధరించాలని, 2004 సెప్టెంబర్ 1కు ముందు నియామకమైన ఉద్యోగులకు ఓపిఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, గత ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా 61 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరారు.

ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు చేపట్టాలని వారు పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు నారాయణ, సైదారావు, యాదగిరి, రామ్మోహన్‌రావు, రాజు, దయాకర్‌రెడ్డి, రామ్మూర్తి, గడ్డమీది పాండురంగం, అక్బర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News