ఉద్యోగుల డిమాండ్లపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
ఉద్యోగుల డిమాండ్లపై రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు
Editor Desk
జూన్ 2 నాటికి పిఆర్సి అమలు చేయాలి – జేఏసీ డిమాండ్
యాదగిరిగుట్ట: రాష్ట్రంలో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికులు, పెన్షనర్ల పెండింగ్ డిమాండ్ల పరిష్కారాన్ని కోరుతూ గురువారం రాష్ట్రవ్యాప్తంగా నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసనలు చేపట్టారు. తెలంగాణ ఎంప్లాయిస్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపుతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భాగంగా యాదగిరిగుట్టలో తాసిల్దార్ గణేష్ నాయక్కు వినతి పత్రం అందజేశారు.
జేఏసీ నాయకులు మాట్లాడుతూ, రాష్ట్రంలో దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా జూన్ 2 నాటికి పిఆర్సి అమలు చేయాలని కోరారు. రిటైర్డ్ ఉద్యోగులకు పెండింగ్ బిల్లులను వెంటనే క్లియర్ చేయాలని, ఎంప్లాయిస్ హెల్త్ స్కీమ్ను అమల్లోకి తీసుకువచ్చి అందరికీ హెల్త్ కార్డులు జారీ చేయాలని తెలిపారు.
సిపిఎస్ రద్దు చేసి పాత పెన్షన్ విధానం (ఓపిఎస్) పునరుద్ధరించాలని, 2004 సెప్టెంబర్ 1కు ముందు నియామకమైన ఉద్యోగులకు ఓపిఎస్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, గత ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా 61 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వీఆర్ఏల సమస్యలను పరిష్కరించాలని కోరారు.
ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సాధారణ బదిలీలు చేపట్టాలని వారు పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు నారాయణ, సైదారావు, యాదగిరి, రామ్మోహన్రావు, రాజు, దయాకర్రెడ్డి, రామ్మూర్తి, గడ్డమీది పాండురంగం, అక్బర్, సురేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి