Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 13, 2026 05:23 PM

ఉద్యమకారులకు తీపి కబురు..! ప్రత్యేక కమిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగు

ఉద్యమకారులకు తీపి కబురు..! ప్రత్యేక కమిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగు

ఉద్యమకారులకు తీపి కబురు..! ప్రత్యేక కమిటీ ఏర్పాటు దిశగా ప్రభుత్వం అడుగు
March 13, 2026 04:09 PM 17 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

హైదరాబాద్, తెలంగాణ ఉద్యమకారులకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు దిశగా కీలక పరిణామం చోటుచేసుకుంది. ఉద్యమకారుల సమస్యలు, సంక్షేమంపై చర్చించేందుకు మంత్రి పొన్నం ప్రభాకర్ , ఎమ్మెల్సీలు M. కోదండరాం మరియు అద్దంకి దయాకర్మి నిస్టర్ క్వార్టర్స్‌లో సమావేశమయ్యారు.

తెలంగాణ మలిదశ ఉద్యమంలో ప్రాణాలకు తెగించి పోరాడిన ఉద్యమకారుల సంక్షేమంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలుకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేయాలనే అంశంపై ఈ సమావేశంలో ప్రాథమికంగా చర్చించారు.

ఈ కమిటీలో మహిళలు, వివిధ వర్గాలకు ప్రాతినిధ్యం కల్పించాలని నిర్ణయించారు. క్షేత్రస్థాయిలో నిజమైన ఉద్యమకారులను గుర్తించేందుకు జిల్లాల వారీగా సర్వేలు నిర్వహించాలని, వారి సమస్యలు, డిమాండ్లపై సమగ్ర అధ్యయనం చేయాలని నేతలు అభిప్రాయపడ్డారు. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించిన అర్హత ప్రమాణాలు, విధివిధానాలపై కూడా సుదీర్ఘంగా చర్చించారు.

ఈ అంశంపై త్వరలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తో ప్రత్యేక సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారు. తెలంగాణ సాధనలో ఉద్యమకారుల త్యాగాలు అమూల్యమైనవని, వారికి న్యాయం చేసే బాధ్యత ప్రభుత్వంపై ఉందని నేతలు పేర్కొన్నారు.

వచ్చే వారం మరోసారి సమావేశమై కమిటీ సభ్యుల ఎంపిక, అమలు ప్రణాళికపై స్పష్టతనివ్వాలని నిర్ణయించారు. ఈ సమావేశం తెలంగాణ ఉద్యమకారుల్లో కొత్త ఆశలను రేకెత్తిస్తోంది.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News