ఉద్యమకారులకు అండగా విజయశాంతి. కృతజ్ఞతలు తెలిపిన జోగు అంజన్న
ఉద్యమకారులకు అండగా విజయశాంతి. కృతజ్ఞతలు తెలిపిన జోగు అంజన్న
Editor Desk
శాసన మండలిలో ఉద్యమకారుల సమస్యలను గట్టిగా ప్రస్తావించి, వారికి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ, సినీనటి, సీనియర్ ఉద్యమకారిణి విజయశాంతికి ఉద్యమకారుల ఫోరం కృతజ్ఞతలు తెలిపింది.
ఉద్యమకారుల కోరికలు న్యాయమైనవేనని, ఇప్పటివరకు వారికి అన్యాయం జరుగుతూనే వచ్చిందని ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న పేర్కొన్నారు. సబ్ కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
గత రెండేళ్ల కాలం కళ్లుమూసి తెరిచేలోపే గడిచిపోయిందని, ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతి ధైర్యంగా ముందుకు వచ్చి ఉద్యమకారుల తరఫున నిలబడటం అభినందనీయమని తెలిపారు.
ఉద్యమకారుల గౌరవాన్ని కాపాడుతూ ప్రజాప్రతినిధులను నిలదీసిన విజయశాంతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి