Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:19 PM

ఉద్యమకారులకు అండగా విజయశాంతి. కృతజ్ఞతలు తెలిపిన జోగు అంజన్న

ఉద్యమకారులకు అండగా విజయశాంతి. కృతజ్ఞతలు తెలిపిన జోగు అంజన్న

ఉద్యమకారులకు అండగా విజయశాంతి. కృతజ్ఞతలు తెలిపిన జోగు అంజన్న
31-03-2026 41 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

శాసన మండలిలో ఉద్యమకారుల సమస్యలను గట్టిగా ప్రస్తావించి, వారికి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ, సినీనటి, సీనియర్ ఉద్యమకారిణి విజయశాంతికి ఉద్యమకారుల ఫోరం కృతజ్ఞతలు తెలిపింది.

ఉద్యమకారుల కోరికలు న్యాయమైనవేనని, ఇప్పటివరకు వారికి అన్యాయం జరుగుతూనే వచ్చిందని ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న పేర్కొన్నారు. సబ్ కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గత రెండేళ్ల కాలం కళ్లుమూసి తెరిచేలోపే గడిచిపోయిందని, ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతి ధైర్యంగా ముందుకు వచ్చి ఉద్యమకారుల తరఫున నిలబడటం అభినందనీయమని తెలిపారు.

ఉద్యమకారుల గౌరవాన్ని కాపాడుతూ ప్రజాప్రతినిధులను నిలదీసిన విజయశాంతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Sthanikam

ఉద్యమకారులకు అండగా విజయశాంతి. కృతజ్ఞతలు తెలిపిన జోగు అంజన్న

Article Image

శాసన మండలిలో ఉద్యమకారుల సమస్యలను గట్టిగా ప్రస్తావించి, వారికి ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని ప్రభుత్వాన్ని నిలదీసిన ఎమ్మెల్సీ, సినీనటి, సీనియర్ ఉద్యమకారిణి విజయశాంతికి ఉద్యమకారుల ఫోరం కృతజ్ఞతలు తెలిపింది.

ఉద్యమకారుల కోరికలు న్యాయమైనవేనని, ఇప్పటివరకు వారికి అన్యాయం జరుగుతూనే వచ్చిందని ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జోగు అంజన్న పేర్కొన్నారు. సబ్ కమిటీ పేరుతో కాలయాపన చేయకుండా ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని ఆయన డిమాండ్ చేశారు.

గత రెండేళ్ల కాలం కళ్లుమూసి తెరిచేలోపే గడిచిపోయిందని, ఇప్పటికైనా ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాల్సిన బాధ్యత ఉందన్నారు. ఈ నేపథ్యంలో విజయశాంతి ధైర్యంగా ముందుకు వచ్చి ఉద్యమకారుల తరఫున నిలబడటం అభినందనీయమని తెలిపారు.

ఉద్యమకారుల గౌరవాన్ని కాపాడుతూ ప్రజాప్రతినిధులను నిలదీసిన విజయశాంతికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News