నియామక పత్రం అందజేసిన రాష్ట్ర అధ్యక్షుడు డా. చీమ శ్రీనివాస్
తెలంగాణ మలిదశ ఉద్యమకారుడు, కోదాడ పట్టణానికి చెందిన ఎండి మజాహర్ను తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా నియమించారు. బుధవారం జరిగిన రాష్ట్ర కమిటీ సమావేశంలో ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఈ మేరకు నియామక పత్రాన్ని అందజేశారు. మజాహర్ గతంలో సూర్యాపేట జిల్లా కన్వీనర్గా ఉండి, ఉద్యమకారుల సమస్యల పరిష్కారంలో చురుగ్గా పనిచేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆయన అందించిన సేవలను గుర్తించి రాష్ట్ర కమిటీలో ఈ కీలక బాధ్యతలను అప్పగించినట్లు చీమ శ్రీనివాస్ తెలిపారు.......

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి