Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 09:59 PM

ఉద్యమకారుల మహాసభకు భారీ ఏర్పాట్లు. జోగు అంజన్న

ఉద్యమకారుల మహాసభకు భారీ ఏర్పాట్లు. జోగు అంజన్న

ఉద్యమకారుల మహాసభకు భారీ ఏర్పాట్లు. జోగు అంజన్న
April 17, 2026 05:47 PM 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

33 జిల్లాల నుంచి తరలిరండి.. హక్కుల సాధనకు ఐక్యంగా పోరాటం

హైదరాబాద్ (తార్నాక): ఉద్యమకారుల హక్కుల సాధన కోసం రాష్ట్రస్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న తెలిపారు. డాక్టర్ చీమ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం తార్నాకలోని మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్‌లో ఈ మహాసభ జరగనుంది.

ఈ సందర్భంగా రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఉద్యమకారులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 18వ తేదీ ఉదయం 9.30 గంటలకు తార్నాక చౌరస్తా నుంచి ర్యాలీగా ఫంక్షన్ హాల్‌కు చేరుకుని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం కొనసాగుతుందని తెలిపారు.

ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ విజయశాంతి, ఉద్యమ నాయకులు కోదండరాం తదితరులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.

ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, గుర్తింపు కోసం సబ్ కమిటీని త్వరగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తొలి, మలిదశ ఉద్యమకారుల్లో అనేక మంది ఇప్పటికే కనుమరుగైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.

ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం, ₹25 వేల పెన్షన్, ₹10 వేల కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, గుర్తింపు కార్డులు జారీ చేసి బస్సులు, రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News