ఉద్యమకారుల మహాసభకు భారీ ఏర్పాట్లు. జోగు అంజన్న
ఉద్యమకారుల మహాసభకు భారీ ఏర్పాట్లు. జోగు అంజన్న
Editor Desk
33 జిల్లాల నుంచి తరలిరండి.. హక్కుల సాధనకు ఐక్యంగా పోరాటం
హైదరాబాద్ (తార్నాక): ఉద్యమకారుల హక్కుల సాధన కోసం రాష్ట్రస్థాయి విస్తృత సమావేశాన్ని నిర్వహించనున్నట్లు ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న తెలిపారు. డాక్టర్ చీమ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో శనివారం తార్నాకలోని మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో ఈ మహాసభ జరగనుంది.
ఈ సందర్భంగా రాష్ట్రంలోని 33 జిల్లాల నుంచి ఉద్యమకారులు భారీగా తరలివచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. 18వ తేదీ ఉదయం 9.30 గంటలకు తార్నాక చౌరస్తా నుంచి ర్యాలీగా ఫంక్షన్ హాల్కు చేరుకుని, ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సమావేశం కొనసాగుతుందని తెలిపారు.
ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్, ఎమ్మెల్సీ విజయశాంతి, ఉద్యమ నాయకులు కోదండరాం తదితరులు హాజరుకానున్నట్లు పేర్కొన్నారు.
ఉద్యమకారులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని, గుర్తింపు కోసం సబ్ కమిటీని త్వరగా ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. తొలి, మలిదశ ఉద్యమకారుల్లో అనేక మంది ఇప్పటికే కనుమరుగైపోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఉద్యమకారులకు 250 గజాల ఇళ్ల స్థలం, ₹25 వేల పెన్షన్, ₹10 వేల కోట్లతో సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని, గుర్తింపు కార్డులు జారీ చేసి బస్సులు, రైళ్లలో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి