Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 07, 2026 04:40 AM

ఉద్యమకారుల గుర్తింపుకు ఉపసంఘం ఏర్పాటు చేయాలి.. ఎమ్మెల్యే కవ్వంపల్లిని కలిసిన ఫోరం నాయకులు

ఉద్యమకారుల గుర్తింపుకు ఉపసంఘం ఏర్పాటు చేయాలి.. ఎమ్మెల్యే కవ్వంపల్లిని కలిసిన ఫోరం నాయకులు

ఉద్యమకారుల గుర్తింపుకు ఉపసంఘం ఏర్పాటు చేయాలి.. ఎమ్మెల్యే కవ్వంపల్లిని కలిసిన ఫోరం నాయకులు
March 06, 2026 07:12 PM 11 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

కరీంనగర్: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉపసంఘాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకులు కోరారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కావాంపల్లి సత్యనారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు నాయకులు తెలిపారు.

హైదరాబాద్‌లోని శిల్పకాల వేదిక లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు Dr చీమ శ్రీనివాస రావు , రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు ఆంజనేయ (జోగు అంజన్న ) ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ఈ అంశంపై వినతిపత్రం సమర్పించారు.

ఈ సందర్భంగా ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఉపసంఘాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి తాను పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.

ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News