ఉద్యమకారుల గుర్తింపుకు ఉపసంఘం ఏర్పాటు చేయాలి.. ఎమ్మెల్యే కవ్వంపల్లిని కలిసిన ఫోరం నాయకులు
ఉద్యమకారుల గుర్తింపుకు ఉపసంఘం ఏర్పాటు చేయాలి.. ఎమ్మెల్యే కవ్వంపల్లిని కలిసిన ఫోరం నాయకులు
స్థానికం బృందం
కరీంనగర్: తెలంగాణ ఉద్యమకారుల గుర్తింపు ప్రక్రియను వేగవంతం చేయడానికి ఉపసంఘాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని తెలంగాణ ఉద్యమకారుల వేదిక నాయకులు కోరారు. ఈ మేరకు కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యే కావాంపల్లి సత్యనారాయణ ను మర్యాదపూర్వకంగా కలిసినట్లు నాయకులు తెలిపారు.
హైదరాబాద్లోని శిల్పకాల వేదిక లో తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర అధ్యక్షులు Dr చీమ శ్రీనివాస రావు , రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు ఆంజనేయ (జోగు అంజన్న ) ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి ఈ అంశంపై వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా ఉద్యమకారులను గుర్తించే ప్రక్రియలో భాగంగా ఉపసంఘాన్ని త్వరగా ఏర్పాటు చేయాలని కోరినట్లు తెలిపారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఉద్యమకారుల సమస్యల పరిష్కారానికి తాను పూర్తిగా సహకరిస్తానని హామీ ఇచ్చినట్లు తెలిపారు.
ఈ విషయాన్ని తెలంగాణ ఉద్యమకారుల వేదిక రాష్ట్ర ఉపాధ్యక్షులు జోగు అంజన్న ఒక పత్రికా ప్రకటనలో వెల్లడించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి