Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నూతన బాధ్యతలు చేపట్టిన రాజు పటేల్‌కు ఘన స్వాగతం కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: June 04, 2026 04:54 AM

తుంగతుర్తి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన; ఎస్పీ నరసింహ

తుంగతుర్తి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన; ఎస్పీ నరసింహ

తుంగతుర్తి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన; ఎస్పీ నరసింహ
June 02, 2026 08:43 PM 73 Views
Reporter
స్థానికం ప్రతినిధి : thungathurthi
Bandi Kiran Kumar

తుంగతుర్తి మండల పోలీస్ స్టేషన్ ను మంగళవారం నాడుఆకస్మికంగా జిల్లా ఎస్పీ నరసింహం తనిఖీ చేశారు. ముందుగా ఎస్పీకి పోలీసు సిబ్బంది గౌరవ వందనం స్వాగతం పలికారు.

పోలీసు దర్యాప్తు, కేసుల చేదనలో పోలీస్ శాఖ అత్యంత సాంకేతికత, ఆధునిక పద్ధతుల్లో ప్రణాళిక ప్రకారం పని చేస్తుంది. తప్పులు, నేరాలకు పాల్పడితే త్వరితగతిన కేసులు చేదించలని సాంకేతికత ఆధారాలు, బలమైన సాక్షాదారాలతో కేసుల్లో నిందితులకు త్వరితగతిన శిక్షలు అమలు అయ్యేలా పోలీస్ శాఖ కృషి చేస్తుందని ఎస్పీ నరసింహ తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్ పరిసరాలు పరిశీలించారు. పోలీస్ కవాతు, పోలీస్ సామాగ్రి పరిశీలించి సిబ్బంది సమస్యలు అడిగి తెలుసుకున్నారు, సిబ్బందితో కలిసి స్టేషన్ ప్రాంగణంలో మొక్కలు నాటారు. పోలీస్ స్టేషన్లో సిబ్బంది పనితీరును తనిఖీ చేశారు, ఫిర్యాదుల నిర్వహణ అంతర్జాలం నమోదు పరిశీలన చేసి ఫిర్యాదుదారులకు భరోసా కల్పించాలని ఫిర్యాదులపై వేగంగా దర్యాప్తు చేయాలని సూచించారు. అనంతరం స్టేషన్లో నిర్వహిస్తున్న వివిధ రకాల రికార్డ్స్ ను క్షుణ్ణంగా పరిశీలించి అధికారులకు సలహాలు సూచనలు అందించారు. స్టేషన్ పరిధిలో ఉన్న సస్పెక్ట్ షీట్స్, రౌడీ షీట్స్ విలేజ్ హిస్టరీ సీట్స్ ను ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలని తెలిపారు. పోలీస్ స్టేషన్లో జరుగుతున్న పనితీరుపై డిఎస్పి సీఐ స్థాయి అధికారులు నిరంతరంగా పర్యవేక్షణ చేయాలి అన్నారు. నేనుసైతం కార్యక్రమంలో భాగంగా సీసీటీవీ కెమెరాలు పెట్టుకునేలా ప్రజలను ప్రోత్సహించాలని, కమ్యూనిటీ పోలీసింగ్ నిర్వహిస్తూ ఎల్లప్పుడూ ప్రజలకు బాధితులకు అందుబాటులో ఉండాలని తెలిపారూ.

ఈ కార్యక్రమం నందు డిఎస్పి ప్రసన్నకుమార్, నాగారం సర్కిల్ ఇన్స్పెక్టర్ నాగేశ్వరరావు, తుంగతుర్తి ఎస్సై క్రాంతికుమార్, నూతనకల్ ఎస్సై నాగరాజు, మద్దిరాల ఎస్సై వీరన్న, డిసిఆర్బి ఎస్ఐ యాకూబ్, ఆర్ఎస్ఐ అన్వర్, డి సి ఆర్ బి సిబ్బంది అంజన్ రెడ్డి శేఖర్ రెడ్డి, సిసి సందీప్, టెక్నికల్ టీం కానిస్టేబుల్ సుమన్, స్టేషన్ సిబ్బంది ఉన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News