Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు కోదాడలో హిందూ సమ్మేళనం.... రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 17, 2026 10:23 PM

తుంగభద్ర డ్యాం గేట్ల పనుల పరిశీలన.దేవేంద్రప్ప

తుంగభద్ర డ్యాం గేట్ల పనుల పరిశీలన.దేవేంద్రప్ప

తుంగభద్ర డ్యాం గేట్ల పనుల పరిశీలన.దేవేంద్రప్ప
April 17, 2026 08:37 PM 31 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రాయలసీమకు నీటి భరోసా.. మరమ్మత్తులు వేగవంతం చేయాలని ఆదేశం

హొస్పేట్ (కర్ణాటక): రాయలసీమ ప్రాంతానికి జీవనాడిగా నిలిచిన తుంగభద్ర డ్యాం గేట్ల మరమ్మత్తు పనులను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కురుబ కురుమ కార్పొరేషన్ చైర్మన్ మాన్వి దేవేంద్రప్ప పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతం వెనుకబడినదిగా గుర్తింపు పొందినప్పటికీ ప్రతి ఎకరాకు నీరందించాలన్న లక్ష్యంతో చర్యలు కొనసాగుతున్నాయని తెలిపారు. కర్నూలు, అనంతపురం జిల్లాలకు ఈ డ్యాం కీలకమని పేర్కొన్నారు.

గత ఏడాది డ్యాం గేట్లు దెబ్బతిన్న నేపథ్యంలో ఈసారి కొత్త గేట్ల ఏర్పాటుకు ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలు సమన్వయంతో చర్యలు చేపట్టినట్లు వివరించారు. ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్, నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు సూచనల మేరకు పనులు వేగవంతం చేస్తున్నట్లు తెలిపారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News