Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:41 AM

తిరువూరు ఎమ్మెల్యే, ఎంపీల తీరుపై కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు ఘాటు విమర్శలు

తిరువూరు ఎమ్మెల్యే, ఎంపీల తీరుపై కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు ఘాటు విమర్శలు

తిరువూరు ఎమ్మెల్యే, ఎంపీల తీరుపై కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు ఘాటు విమర్శలు
07-03-2026 39 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో రాజకీయ వర్గపోరు ప్రజలలో చర్చనీయాంశంగా మారిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లెపాటి శ్రీనివాసరావు విమర్శించారు. తిరువూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి మరియు పార్లమెంటు సభ్యుడు కేశినేని మధ్య జరుగుతున్న వర్గపోరు నియోజకవర్గ అభివృద్ధికి అడ్డంకిగా మారిందని ఆయన ఆరోపించారు. ఇసుక, మట్టి, రేషన్, లిక్కర్ వ్యాపారాల లావాదేవీలలో వచ్చిన విభేదాల కారణంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరిస్తున్నారని మండిపడ్డారు.

తిరువూరు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించకుండా రాజకీయ లాభాల కోసం మహిళలను కూడా వివాదాల్లోకి లాగడం సిగ్గుచేటు చర్య అని ఆయన విమర్శించారు. సత్యం, ధర్మం, న్యాయం బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముని పేరును కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం తగదన్నారు.

గంపలగూడెం మండలంలో కట్లేరు వాగుపై నిర్మించాల్సిన వంతెన పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని, నిధులు వచ్చాయని చెబుతున్నా వాస్తవానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాలేదని పేర్కొన్నారు. నిజంగా నిధులు మంజూరు అయ్యుంటే వంతెన పనులు ఎప్పుడో ప్రారంభమయ్యేవని అన్నారు.

ఎంపీ, ఎమ్మెల్యే డ్రామా రాజకీయాలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేస్తున్నారని, తమను ఎన్నుకున్న ప్రజలను మోసం చేస్తున్నారని పల్లెపాటి శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు.

Sthanikam

తిరువూరు ఎమ్మెల్యే, ఎంపీల తీరుపై కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు ఘాటు విమర్శలు

Article Image

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో రాజకీయ వర్గపోరు ప్రజలలో చర్చనీయాంశంగా మారిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లెపాటి శ్రీనివాసరావు విమర్శించారు. తిరువూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి మరియు పార్లమెంటు సభ్యుడు కేశినేని మధ్య జరుగుతున్న వర్గపోరు నియోజకవర్గ అభివృద్ధికి అడ్డంకిగా మారిందని ఆయన ఆరోపించారు. ఇసుక, మట్టి, రేషన్, లిక్కర్ వ్యాపారాల లావాదేవీలలో వచ్చిన విభేదాల కారణంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరిస్తున్నారని మండిపడ్డారు.

తిరువూరు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించకుండా రాజకీయ లాభాల కోసం మహిళలను కూడా వివాదాల్లోకి లాగడం సిగ్గుచేటు చర్య అని ఆయన విమర్శించారు. సత్యం, ధర్మం, న్యాయం బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముని పేరును కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం తగదన్నారు.

గంపలగూడెం మండలంలో కట్లేరు వాగుపై నిర్మించాల్సిన వంతెన పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని, నిధులు వచ్చాయని చెబుతున్నా వాస్తవానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాలేదని పేర్కొన్నారు. నిజంగా నిధులు మంజూరు అయ్యుంటే వంతెన పనులు ఎప్పుడో ప్రారంభమయ్యేవని అన్నారు.

ఎంపీ, ఎమ్మెల్యే డ్రామా రాజకీయాలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేస్తున్నారని, తమను ఎన్నుకున్న ప్రజలను మోసం చేస్తున్నారని పల్లెపాటి శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News