Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ప్రపంచ పుస్తక దినోత్సవం సందర్భంగా బుక్ రివ్యూ కార్యక్రమం కేతగానిచెరువు : సగర ఉప్పర కులస్థుల ఆత్మీయ పిలుపు ఆర్టీసీ సమ్మె ఎఫెక్ట్.. మహిళల ఉచిత ప్రయాణంపై అనిశ్చితి ఇష్టం లేదన్న వరుడు.. కాబోయే భార్య ఆత్మహత్య ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 24, 2026 07:54 AM

తిరువూరు ఎమ్మెల్యే, ఎంపీల తీరుపై కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు ఘాటు విమర్శలు

తిరువూరు ఎమ్మెల్యే, ఎంపీల తీరుపై కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు ఘాటు విమర్శలు

తిరువూరు ఎమ్మెల్యే, ఎంపీల తీరుపై కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు ఘాటు విమర్శలు
March 07, 2026 08:56 AM 27 Views
Reporter
స్థానికం ప్రతినిధి : ఇంచార్జ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం
GADDAM JAGANMOHAN REDDY

ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో రాజకీయ వర్గపోరు ప్రజలలో చర్చనీయాంశంగా మారిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లెపాటి శ్రీనివాసరావు విమర్శించారు. తిరువూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.

ఈ సందర్భంగా తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి మరియు పార్లమెంటు సభ్యుడు కేశినేని మధ్య జరుగుతున్న వర్గపోరు నియోజకవర్గ అభివృద్ధికి అడ్డంకిగా మారిందని ఆయన ఆరోపించారు. ఇసుక, మట్టి, రేషన్, లిక్కర్ వ్యాపారాల లావాదేవీలలో వచ్చిన విభేదాల కారణంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరిస్తున్నారని మండిపడ్డారు.

తిరువూరు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించకుండా రాజకీయ లాభాల కోసం మహిళలను కూడా వివాదాల్లోకి లాగడం సిగ్గుచేటు చర్య అని ఆయన విమర్శించారు. సత్యం, ధర్మం, న్యాయం బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముని పేరును కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం తగదన్నారు.

గంపలగూడెం మండలంలో కట్లేరు వాగుపై నిర్మించాల్సిన వంతెన పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని, నిధులు వచ్చాయని చెబుతున్నా వాస్తవానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాలేదని పేర్కొన్నారు. నిజంగా నిధులు మంజూరు అయ్యుంటే వంతెన పనులు ఎప్పుడో ప్రారంభమయ్యేవని అన్నారు.

ఎంపీ, ఎమ్మెల్యే డ్రామా రాజకీయాలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేస్తున్నారని, తమను ఎన్నుకున్న ప్రజలను మోసం చేస్తున్నారని పల్లెపాటి శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News