తిరువూరు ఎమ్మెల్యే, ఎంపీల తీరుపై కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు ఘాటు విమర్శలు
తిరువూరు ఎమ్మెల్యే, ఎంపీల తీరుపై కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షులు పల్లెపాటి శ్రీనివాసరావు ఘాటు విమర్శలు
GADDAM JAGANMOHAN REDDY
ఎన్టీఆర్ జిల్లా తిరువూరు నియోజకవర్గంలో రాజకీయ వర్గపోరు ప్రజలలో చర్చనీయాంశంగా మారిందని కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు పల్లెపాటి శ్రీనివాసరావు విమర్శించారు. తిరువూరులోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
ఈ సందర్భంగా తిరువూరు ఎమ్మెల్యే కోలికపూడి మరియు పార్లమెంటు సభ్యుడు కేశినేని మధ్య జరుగుతున్న వర్గపోరు నియోజకవర్గ అభివృద్ధికి అడ్డంకిగా మారిందని ఆయన ఆరోపించారు. ఇసుక, మట్టి, రేషన్, లిక్కర్ వ్యాపారాల లావాదేవీలలో వచ్చిన విభేదాల కారణంగా ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రజా సమస్యలను పూర్తిగా విస్మరిస్తున్నారని మండిపడ్డారు.
తిరువూరు నియోజకవర్గంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ వాటిని పరిష్కరించకుండా రాజకీయ లాభాల కోసం మహిళలను కూడా వివాదాల్లోకి లాగడం సిగ్గుచేటు చర్య అని ఆయన విమర్శించారు. సత్యం, ధర్మం, న్యాయం బోధించిన శ్రీకృష్ణ పరమాత్ముని పేరును కూడా రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగించడం తగదన్నారు.
గంపలగూడెం మండలంలో కట్లేరు వాగుపై నిర్మించాల్సిన వంతెన పనులు ఇప్పటికీ ప్రారంభం కాలేదని, నిధులు వచ్చాయని చెబుతున్నా వాస్తవానికి ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు కాలేదని పేర్కొన్నారు. నిజంగా నిధులు మంజూరు అయ్యుంటే వంతెన పనులు ఎప్పుడో ప్రారంభమయ్యేవని అన్నారు.
ఎంపీ, ఎమ్మెల్యే డ్రామా రాజకీయాలు చేస్తూ ప్రజల విశ్వాసాన్ని ద్రోహం చేస్తున్నారని, తమను ఎన్నుకున్న ప్రజలను మోసం చేస్తున్నారని పల్లెపాటి శ్రీనివాసరావు తీవ్రంగా విమర్శించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి