తాటి చెట్టు నుంచి జారి గీత కార్మికుడు తీవ్ర గాయాలు
తాటి చెట్టు నుంచి జారి గీత కార్మికుడు తీవ్ర గాయాలు
Editor Desk
భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన గీత కార్మికుడు మట్ట చిన్న బాలరాజు గౌడ్ తాటి చెట్టు ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం ఉదయం వృత్తి నిర్వహణలో భాగంగా చెట్టు ఎక్కిన ఆయనకు ఎండ వేడి కారణంగా కాళ్లకు చెమటలు రావడంతో జారి పడినట్లు స్థానికులు తెలిపారు.
గాయపడిన బాలరాజును వెంటనే భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్లోని సుప్రజ ఆసుపత్రికి మార్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.
ఇటీవల కాలంలోనే నందనం గ్రామంలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయి. గత ఏడాదిలో నలుగురు గీత కార్మికులు తాటి చెట్లపై నుంచి పడి తీవ్ర గాయాలకు గురై వృత్తిని మానివేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో వారి కుటుంబాలు జీవనాధారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాయి.
ఈ నేపథ్యంలో గౌడ సంఘ మండల అధ్యక్షుడు నాగేల్లి సత్యనారాయణ గౌడ్ ప్రభుత్వాన్ని కోరుతూ, గీత కార్మికుల భద్రత కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదాల్లో మరణించిన వారికి రూ.10 లక్షలు, వికలాంగులకు రూ.5 లక్షల ఎక్స్గ్రేషియా ఒక నెలలోపు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి