Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చిరుమర్తికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన రామన్నపేట రిపోర్టర్లు రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బాల్య వివాహాలపై అవగాహ కార్యక్రమం ఉధంపూర్‌లో ఘోర ప్రమాదం: 100 అడుగుల లోయలో పడ్డ బస్సు.. 15 మంది మృతి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 20, 2026 08:16 PM

తాటి చెట్టు నుంచి జారి గీత కార్మికుడు తీవ్ర గాయాలు

తాటి చెట్టు నుంచి జారి గీత కార్మికుడు తీవ్ర గాయాలు

తాటి చెట్టు నుంచి జారి గీత కార్మికుడు తీవ్ర గాయాలు
April 20, 2026 05:47 PM 193 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన గీత కార్మికుడు మట్ట చిన్న బాలరాజు గౌడ్ తాటి చెట్టు ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం ఉదయం వృత్తి నిర్వహణలో భాగంగా చెట్టు ఎక్కిన ఆయనకు ఎండ వేడి కారణంగా కాళ్లకు చెమటలు రావడంతో జారి పడినట్లు స్థానికులు తెలిపారు.

గాయపడిన బాలరాజును వెంటనే భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని సుప్రజ ఆసుపత్రికి మార్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

ఇటీవల కాలంలోనే నందనం గ్రామంలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయి. గత ఏడాదిలో నలుగురు గీత కార్మికులు తాటి చెట్లపై నుంచి పడి తీవ్ర గాయాలకు గురై వృత్తిని మానివేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో వారి కుటుంబాలు జీవనాధారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో గౌడ సంఘ మండల అధ్యక్షుడు నాగేల్లి సత్యనారాయణ గౌడ్ ప్రభుత్వాన్ని కోరుతూ, గీత కార్మికుల భద్రత కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదాల్లో మరణించిన వారికి రూ.10 లక్షలు, వికలాంగులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఒక నెలలోపు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News