Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 10:27 PM

తాటి చెట్టు నుంచి జారి గీత కార్మికుడు తీవ్ర గాయాలు

తాటి చెట్టు నుంచి జారి గీత కార్మికుడు తీవ్ర గాయాలు

తాటి చెట్టు నుంచి జారి గీత కార్మికుడు తీవ్ర గాయాలు
20-04-2026 444 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన గీత కార్మికుడు మట్ట చిన్న బాలరాజు గౌడ్ తాటి చెట్టు ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం ఉదయం వృత్తి నిర్వహణలో భాగంగా చెట్టు ఎక్కిన ఆయనకు ఎండ వేడి కారణంగా కాళ్లకు చెమటలు రావడంతో జారి పడినట్లు స్థానికులు తెలిపారు.

గాయపడిన బాలరాజును వెంటనే భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని సుప్రజ ఆసుపత్రికి మార్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

ఇటీవల కాలంలోనే నందనం గ్రామంలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయి. గత ఏడాదిలో నలుగురు గీత కార్మికులు తాటి చెట్లపై నుంచి పడి తీవ్ర గాయాలకు గురై వృత్తిని మానివేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో వారి కుటుంబాలు జీవనాధారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో గౌడ సంఘ మండల అధ్యక్షుడు నాగేల్లి సత్యనారాయణ గౌడ్ ప్రభుత్వాన్ని కోరుతూ, గీత కార్మికుల భద్రత కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదాల్లో మరణించిన వారికి రూ.10 లక్షలు, వికలాంగులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఒక నెలలోపు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Sthanikam

తాటి చెట్టు నుంచి జారి గీత కార్మికుడు తీవ్ర గాయాలు

Article Image

భువనగిరి: యాదాద్రి భువనగిరి జిల్లా భువనగిరి మండలం నందనం గ్రామానికి చెందిన గీత కార్మికుడు మట్ట చిన్న బాలరాజు గౌడ్ తాటి చెట్టు ఎక్కే సమయంలో ప్రమాదవశాత్తు కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. సోమవారం ఉదయం వృత్తి నిర్వహణలో భాగంగా చెట్టు ఎక్కిన ఆయనకు ఎండ వేడి కారణంగా కాళ్లకు చెమటలు రావడంతో జారి పడినట్లు స్థానికులు తెలిపారు.

గాయపడిన బాలరాజును వెంటనే భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించి, అనంతరం మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్‌లోని సుప్రజ ఆసుపత్రికి మార్చారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం.

ఇటీవల కాలంలోనే నందనం గ్రామంలో ఇలాంటి ప్రమాదాలు పునరావృతమవుతున్నాయి. గత ఏడాదిలో నలుగురు గీత కార్మికులు తాటి చెట్లపై నుంచి పడి తీవ్ర గాయాలకు గురై వృత్తిని మానివేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి. దీంతో వారి కుటుంబాలు జీవనాధారం కోల్పోయి ఇబ్బందులు పడుతున్నాయి.

ఈ నేపథ్యంలో గౌడ సంఘ మండల అధ్యక్షుడు నాగేల్లి సత్యనారాయణ గౌడ్ ప్రభుత్వాన్ని కోరుతూ, గీత కార్మికుల భద్రత కోసం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి తీసుకురావాలని విజ్ఞప్తి చేశారు. ప్రమాదాల్లో మరణించిన వారికి రూ.10 లక్షలు, వికలాంగులకు రూ.5 లక్షల ఎక్స్‌గ్రేషియా ఒక నెలలోపు అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News