PRINT TIME: April 17, 2026 05:59 PM
తార్నాక సదస్సుకు ఉద్యమకారుల ర్యాలీ.. భారీగా తరలిరండి పిలుపు
తార్నాక సదస్సుకు ఉద్యమకారుల ర్యాలీ.. భారీగా తరలిరండి పిలుపు
April 17, 2026 03:58 PM
28 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట: తెలంగాణ ఉద్యమకారుల సదస్సును జయప్రదం చేయాలని ఉద్యమకారుల నేతలు పిలుపునిచ్చారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సమావేశంలో రాష్ట్ర మైనార్టీ సెల్ కన్వీనర్ షేక్ చాంద్ మాట్లాడారు. శనివారం హైదరాబాద్ తార్నాకలోని మర్రి కృష్ణారెడ్డి ఫంక్షన్ హాల్లో జరగనున్న సదస్సుకు పెద్దఎత్తున ఉద్యమకారులు తరలివచ్చాలని కోరారు.
ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగే ఈ సదస్సులో తెలంగాణ ఉద్యమకారుల సమస్యలపై చర్చించనున్నట్లు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీల ప్రకారం నిజమైన ఉద్యమకారులను గుర్తించి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, 250 గజాల స్థలం, పెన్షన్లు, ప్రభుత్వ పథకాలలో 20 శాతం కేటాయింపులు అమలు చేయాలని డిమాండ్ చేశారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి