Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:52 AM

తాజ్‌పూర్‌లో నూతన మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన

తాజ్‌పూర్‌లో నూతన మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన

తాజ్‌పూర్‌లో నూతన మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన
29-05-2026 97 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహిళా సాధికారతకు మరింత బలం చేకూర్చనున్న ‘వీఓ బిల్డింగ్’

గ్రామ అభివృద్ధికి పాలకవర్గం కృషి అభినందనీయం

మహిళా సాధికారత, సంఘ సమావేశాల నిర్వహణ కోసం తాజ్‌పూర్ గ్రామ పంచాయితీకి నూతనంగా మంజూరైన మహిళా భవనం (వీఓ బిల్డింగ్) నిర్మాణానికి శుక్రవారం ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎంపీడీవో దినకర్, పీఆర్ఏఈ శ్యామ్ సుందర్ రెడ్డి, సామాజికవేత్త డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత అభివృద్ధి చెందేందుకు ఈ మహిళా భవనం ఎంతో ఉపయోగపడుతుందని సర్పంచ్ పేర్కొన్నారు. మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యకలాపాలకు ఈ భవనం కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, వారి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు పేర్కొన్నారు. మహిళా సంఘాల బలోపేతానికి ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వరిగంటి కృష్ణ, పంచాయితీ కార్యదర్శి బి.నరేందర్, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, మహ్మద్ గాలిబీ యాకూబ్, బొమ్మారపు రామకృష్ణ, బొమ్మారపు లక్ష్మి బాలరాజ్, బీట్కురి మహేష్, వరిగంటి మానస నాగరాజు, షేక్ అహ్మద్ పాల్గొన్నారు.

అలాగే సంఘ బంధం అధ్యక్షురాలు వరిగంటి రమ్య, సభ్యులు గుల్వాని రమ్య, బొమ్మారపు శ్రీలత, వీఏకే బొమ్మారపు అనురాధలతో పాటు వివిధ మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Sthanikam

తాజ్‌పూర్‌లో నూతన మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన

Article Image

మహిళా సాధికారతకు మరింత బలం చేకూర్చనున్న ‘వీఓ బిల్డింగ్’

గ్రామ అభివృద్ధికి పాలకవర్గం కృషి అభినందనీయం

మహిళా సాధికారత, సంఘ సమావేశాల నిర్వహణ కోసం తాజ్‌పూర్ గ్రామ పంచాయితీకి నూతనంగా మంజూరైన మహిళా భవనం (వీఓ బిల్డింగ్) నిర్మాణానికి శుక్రవారం ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎంపీడీవో దినకర్, పీఆర్ఏఈ శ్యామ్ సుందర్ రెడ్డి, సామాజికవేత్త డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత అభివృద్ధి చెందేందుకు ఈ మహిళా భవనం ఎంతో ఉపయోగపడుతుందని సర్పంచ్ పేర్కొన్నారు. మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యకలాపాలకు ఈ భవనం కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, వారి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు పేర్కొన్నారు. మహిళా సంఘాల బలోపేతానికి ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వరిగంటి కృష్ణ, పంచాయితీ కార్యదర్శి బి.నరేందర్, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, మహ్మద్ గాలిబీ యాకూబ్, బొమ్మారపు రామకృష్ణ, బొమ్మారపు లక్ష్మి బాలరాజ్, బీట్కురి మహేష్, వరిగంటి మానస నాగరాజు, షేక్ అహ్మద్ పాల్గొన్నారు.

అలాగే సంఘ బంధం అధ్యక్షురాలు వరిగంటి రమ్య, సభ్యులు గుల్వాని రమ్య, బొమ్మారపు శ్రీలత, వీఏకే బొమ్మారపు అనురాధలతో పాటు వివిధ మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News