తాజ్పూర్లో నూతన మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన
తాజ్పూర్లో నూతన మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన
Editor Desk
మహిళా సాధికారతకు మరింత బలం చేకూర్చనున్న ‘వీఓ బిల్డింగ్’
గ్రామ అభివృద్ధికి పాలకవర్గం కృషి అభినందనీయం
మహిళా సాధికారత, సంఘ సమావేశాల నిర్వహణ కోసం తాజ్పూర్ గ్రామ పంచాయితీకి నూతనంగా మంజూరైన మహిళా భవనం (వీఓ బిల్డింగ్) నిర్మాణానికి శుక్రవారం ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ఎంపీడీవో దినకర్, పీఆర్ఏఈ శ్యామ్ సుందర్ రెడ్డి, సామాజికవేత్త డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత అభివృద్ధి చెందేందుకు ఈ మహిళా భవనం ఎంతో ఉపయోగపడుతుందని సర్పంచ్ పేర్కొన్నారు. మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యకలాపాలకు ఈ భవనం కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, వారి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు పేర్కొన్నారు. మహిళా సంఘాల బలోపేతానికి ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వరిగంటి కృష్ణ, పంచాయితీ కార్యదర్శి బి.నరేందర్, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, మహ్మద్ గాలిబీ యాకూబ్, బొమ్మారపు రామకృష్ణ, బొమ్మారపు లక్ష్మి బాలరాజ్, బీట్కురి మహేష్, వరిగంటి మానస నాగరాజు, షేక్ అహ్మద్ పాల్గొన్నారు.
అలాగే సంఘ బంధం అధ్యక్షురాలు వరిగంటి రమ్య, సభ్యులు గుల్వాని రమ్య, బొమ్మారపు శ్రీలత, వీఏకే బొమ్మారపు అనురాధలతో పాటు వివిధ మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి