Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
రోడ్డు ప్రమాదాల నివారణలో అధికారులు బాధ్యతగా పనిచేయాలి: కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ కష్టమే విజయానికి మార్గం.. వెస్టీజ్‌లో రాణించిన అజ్మీరా శర్వాణ్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 31, 2026 03:15 AM

తాజ్‌పూర్‌లో నూతన మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన

తాజ్‌పూర్‌లో నూతన మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన

తాజ్‌పూర్‌లో నూతన మహిళా భవన నిర్మాణానికి శంకుస్థాపన
May 29, 2026 06:08 PM 79 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మహిళా సాధికారతకు మరింత బలం చేకూర్చనున్న ‘వీఓ బిల్డింగ్’

గ్రామ అభివృద్ధికి పాలకవర్గం కృషి అభినందనీయం

మహిళా సాధికారత, సంఘ సమావేశాల నిర్వహణ కోసం తాజ్‌పూర్ గ్రామ పంచాయితీకి నూతనంగా మంజూరైన మహిళా భవనం (వీఓ బిల్డింగ్) నిర్మాణానికి శుక్రవారం ఘనంగా శంకుస్థాపన నిర్వహించారు. గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమాన్ని వైభవంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమానికి ఎంపీడీవో దినకర్, పీఆర్ఏఈ శ్యామ్ సుందర్ రెడ్డి, సామాజికవేత్త డాక్టర్ ర్యాకల శ్రీనివాస్ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. మహిళలు ఆర్థికంగా, సామాజికంగా మరింత అభివృద్ధి చెందేందుకు ఈ మహిళా భవనం ఎంతో ఉపయోగపడుతుందని సర్పంచ్ పేర్కొన్నారు. మహిళా సంఘాల సమావేశాలు, శిక్షణ కార్యక్రమాలు, స్వయం ఉపాధి కార్యకలాపాలకు ఈ భవనం కేంద్రంగా మారుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

గ్రామాభివృద్ధిలో మహిళల పాత్ర కీలకమని, వారి అభివృద్ధికి ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు పేర్కొన్నారు. మహిళా సంఘాల బలోపేతానికి ఈ భవనం ఉపయోగపడుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ వరిగంటి కృష్ణ, పంచాయితీ కార్యదర్శి బి.నరేందర్, వార్డు సభ్యులు పల్లెపాటి కృష్ణ, మహ్మద్ గాలిబీ యాకూబ్, బొమ్మారపు రామకృష్ణ, బొమ్మారపు లక్ష్మి బాలరాజ్, బీట్కురి మహేష్, వరిగంటి మానస నాగరాజు, షేక్ అహ్మద్ పాల్గొన్నారు.

అలాగే సంఘ బంధం అధ్యక్షురాలు వరిగంటి రమ్య, సభ్యులు గుల్వాని రమ్య, బొమ్మారపు శ్రీలత, వీఏకే బొమ్మారపు అనురాధలతో పాటు వివిధ మహిళా సంఘాల సభ్యులు, గ్రామ పెద్దలు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News