గ్రామ ప్రజల శ్రేయస్సే నా లక్ష్యం, సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్
భువనగిరి మండల పరిధిలోని తాజ్ పూర్ గ్రామంలో ప్రజా పాలన-ప్రగతి పాలన,99రోజుల ప్రణాళిక, ప్రభుత్వ కార్యక్రమంలో భాగంగా ఆదివారం ఈ రోజు గ్రామ సర్పంచ్ ర్యాకల సంతోష శ్రీనివాస్ ఆధ్వర్యంలో గ్రామంలోని ప్రతి ఇంటికి తిరిగి తడి చెత్త-పొడి చెత్త సేకరణ, ప్లాస్టిక్ నిషేధం,పరిసరాల పరిశుభ్రత, తదితర విషయాల పట్ల గ్రామ ప్రజలకు అవగాహనా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమం లో సామజిక వేత్త డా,ర్యాకల శ్రీనివాస్,ఉప సర్పంచ్ వరిగంటి క్రిష్ణ,పంచాయతీ కార్యదర్శి నరేందర్,వార్డు సభ్యులు పల్లెపాటి క్రిష్ణ,మహ్మద్ గాలిబీ,బొమ్మారపు రామక్రిష్ణ,బొమ్మారపు లక్ష్మి,బీట్కూరి మహేష్,వరిగంటి మానస,ఎఫ్ఏ.రామస్వామి,ఆరోగ్య కార్యకర్తలు,గ్రామ ప్రజలు గ్రామ పంచాయతీ సిబ్బంది,తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి