Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 11:13 PM

తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు అభినందనీయం. డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ ఆలీ

తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు అభినందనీయం. డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ ఆలీ

తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు అభినందనీయం. డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ ఆలీ
21-04-2026 40 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఎంతో అభినందనీయమని నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ ఆలీ అన్నారు. సోమవారం ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, సమ్మర్ సెలవుల్లో విద్యార్థులు, యువతకు ఇది వినోదంతో పాటు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు ఫిరోజ్, అనికిట్ గుప్తా, రఫీ మాట్లాడుతూ విశాలమైన ప్రదేశంలో ఆకర్షణీయమైన బొమ్మలతో పాటు బ్రేక్ డ్యాన్స్, స్మార్ట్ గేమ్స్, ఎయిర్ బౌన్సర్, మహారాజా ట్రైన్, మేరీ కోలంబస్ వంటి వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే ఫుడ్ కోర్ట్, షాపింగ్ స్టాళ్లతో సందర్శకులకు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు.

ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్‌ను నల్గొండ పట్టణ ప్రజలు, చిన్నారులు, యువత పెద్ద ఎత్తున సందర్శించి ఆస్వాదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మామిడి క్రాంతి కుమార్, మహబూబ్ అలీ, కౌసర్, ఖయ్యూం బేగ్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు అభినందనీయం. డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ ఆలీ

Article Image

నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఎంతో అభినందనీయమని నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ ఆలీ అన్నారు. సోమవారం ఈ ఎగ్జిబిషన్‌ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, సమ్మర్ సెలవుల్లో విద్యార్థులు, యువతకు ఇది వినోదంతో పాటు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.

ఈ సందర్భంగా నిర్వాహకులు ఫిరోజ్, అనికిట్ గుప్తా, రఫీ మాట్లాడుతూ విశాలమైన ప్రదేశంలో ఆకర్షణీయమైన బొమ్మలతో పాటు బ్రేక్ డ్యాన్స్, స్మార్ట్ గేమ్స్, ఎయిర్ బౌన్సర్, మహారాజా ట్రైన్, మేరీ కోలంబస్ వంటి వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే ఫుడ్ కోర్ట్, షాపింగ్ స్టాళ్లతో సందర్శకులకు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు.

ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్‌ను నల్గొండ పట్టణ ప్రజలు, చిన్నారులు, యువత పెద్ద ఎత్తున సందర్శించి ఆస్వాదించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మామిడి క్రాంతి కుమార్, మహబూబ్ అలీ, కౌసర్, ఖయ్యూం బేగ్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News