తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు అభినందనీయం. డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ ఆలీ
తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఏర్పాటు అభినందనీయం. డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ ఆలీ
Editor Desk
నల్గొండ పట్టణంలోని ఎన్జీ కళాశాల ప్రాంగణంలో ఏర్పాటు చేసిన తాజ్ మహల్ ఎగ్జిబిషన్ ఎంతో అభినందనీయమని నగర పాలక సంస్థ డిప్యూటీ మేయర్ ఆశ్రఫ్ ఆలీ అన్నారు. సోమవారం ఈ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన ఆయన మాట్లాడుతూ, సమ్మర్ సెలవుల్లో విద్యార్థులు, యువతకు ఇది వినోదంతో పాటు ఉపయోగకరంగా ఉంటుందని తెలిపారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు ఫిరోజ్, అనికిట్ గుప్తా, రఫీ మాట్లాడుతూ విశాలమైన ప్రదేశంలో ఆకర్షణీయమైన బొమ్మలతో పాటు బ్రేక్ డ్యాన్స్, స్మార్ట్ గేమ్స్, ఎయిర్ బౌన్సర్, మహారాజా ట్రైన్, మేరీ కోలంబస్ వంటి వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు చెప్పారు. అలాగే ఫుడ్ కోర్ట్, షాపింగ్ స్టాళ్లతో సందర్శకులకు మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దినట్లు తెలిపారు.
ప్రతిరోజు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు నిర్వహించే ఈ ఎగ్జిబిషన్ను నల్గొండ పట్టణ ప్రజలు, చిన్నారులు, యువత పెద్ద ఎత్తున సందర్శించి ఆస్వాదించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు మామిడి క్రాంతి కుమార్, మహబూబ్ అలీ, కౌసర్, ఖయ్యూం బేగ్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి