Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
తైబజార్ వేలం రూ.1.68 లక్షలకు కుదిరింది.15 మంది పోటీ మధ్య లగ్గోని యాదగిరి సొంతం. కదం తొక్కిన గిల్.. కోల్‌కతాపై గుజరాత్‌ ఘన విజయం రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 18, 2026 09:47 AM

తైబజార్ వేలం రూ.1.68 లక్షలకు కుదిరింది.15 మంది పోటీ మధ్య లగ్గోని యాదగిరి సొంతం.

తైబజార్ వేలం రూ.1.68 లక్షలకు కుదిరింది.15 మంది పోటీ మధ్య లగ్గోని యాదగిరి సొంతం.

తైబజార్ వేలం రూ.1.68 లక్షలకు కుదిరింది.15 మంది పోటీ మధ్య లగ్గోని యాదగిరి సొంతం.
April 18, 2026 07:30 AM 113 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట గ్రామపంచాయతీ పరిధిలోని తైబజార్ వేలం పాట శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ గరిక సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. వేలంపాటలో పాల్గొనడానికి రూ.10 వేల డిపాజిట్ చెల్లించిన 15 మంది పోటీదారులు హాజరయ్యారు.

సర్కారు నిర్ణయించిన ప్రారంభ ధర రూ.77 వేలుగా ఉండగా, పట్టణానికి చెందిన లగ్గోని యాదగిరి అత్యధికంగా రూ.1.68 లక్షలు పలికి తైబజార్ హక్కులను దక్కించుకున్నారు.

వేలంపాట అనంతరం సర్పంచ్, కార్యవర్గ సభ్యులు మరియు పంచాయతీ కార్యదర్శి సైదిరెడ్డి విజేతను అభినందించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ, వేలం విజేత రెండు రోజులలో 50 శాతం మొత్తాన్ని, మిగతా 50 శాతం వచ్చే సంవత్సరం జనవరి 5 లోపు పూర్తిగా చెల్లించాలని సూచించారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోటే రమేష్, వార్డు సభ్యులు సుర్వి హరిబాబు, గొరిగే శేఖర్, జాడ సంతోష్, అలాగే నాయకులు సాల్వేరు అశోక్, కందుల హనుమంతు, నకిరేకంటి సుదర్శన్, కోట సుధాకర్, పల్లపు రవి, ఊట్కూరి శ్రీను, ఊరే శేఖర్, బండ లింగస్వామి, గొలుసుల ప్రసాద్, నాసర్, మాండ్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News