తైబజార్ వేలం రూ.1.68 లక్షలకు కుదిరింది.15 మంది పోటీ మధ్య లగ్గోని యాదగిరి సొంతం.
తైబజార్ వేలం రూ.1.68 లక్షలకు కుదిరింది.15 మంది పోటీ మధ్య లగ్గోని యాదగిరి సొంతం.
Editor Desk
రామన్నపేట గ్రామపంచాయతీ పరిధిలోని తైబజార్ వేలం పాట శుక్రవారం గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ గరిక సత్యనారాయణ ఆధ్వర్యంలో జరిగింది. వేలంపాటలో పాల్గొనడానికి రూ.10 వేల డిపాజిట్ చెల్లించిన 15 మంది పోటీదారులు హాజరయ్యారు.
సర్కారు నిర్ణయించిన ప్రారంభ ధర రూ.77 వేలుగా ఉండగా, పట్టణానికి చెందిన లగ్గోని యాదగిరి అత్యధికంగా రూ.1.68 లక్షలు పలికి తైబజార్ హక్కులను దక్కించుకున్నారు.
వేలంపాట అనంతరం సర్పంచ్, కార్యవర్గ సభ్యులు మరియు పంచాయతీ కార్యదర్శి సైదిరెడ్డి విజేతను అభినందించారు. ఈ సందర్భంగా కార్యదర్శి మాట్లాడుతూ, వేలం విజేత రెండు రోజులలో 50 శాతం మొత్తాన్ని, మిగతా 50 శాతం వచ్చే సంవత్సరం జనవరి 5 లోపు పూర్తిగా చెల్లించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ మోటే రమేష్, వార్డు సభ్యులు సుర్వి హరిబాబు, గొరిగే శేఖర్, జాడ సంతోష్, అలాగే నాయకులు సాల్వేరు అశోక్, కందుల హనుమంతు, నకిరేకంటి సుదర్శన్, కోట సుధాకర్, పల్లపు రవి, ఊట్కూరి శ్రీను, ఊరే శేఖర్, బండ లింగస్వామి, గొలుసుల ప్రసాద్, నాసర్, మాండ్ర నరేష్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి