Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలి........ ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు హైడ్రాపై హైకోర్టు ఆగ్రహం.. కోర్టుల కంటే మీరే ఎక్కువా..? సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 17, 2026 06:38 PM

తహసీల్దార్‌కు వినతి.. పీఆర్‌సీ, డీఏలు, బకాయిలపై ఉద్యోగుల డిమాండ్

తహసీల్దార్‌కు వినతి.. పీఆర్‌సీ, డీఏలు, బకాయిలపై ఉద్యోగుల డిమాండ్

తహసీల్దార్‌కు వినతి.. పీఆర్‌సీ, డీఏలు, బకాయిలపై ఉద్యోగుల డిమాండ్
April 17, 2026 04:43 PM 55 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట: పీఆర్‌సీ అమలు, డీఏలు విడుదల, పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రామన్నపేట మండలంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు శుక్రవారం తహసీల్దార్ లాల్ బహుదూర్‌కు వినతిపత్రం సమర్పించారు.

మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యలను వివరించారు. పీఆర్‌సీని వెంటనే అమలు చేయడంతో పాటు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం త్వరితగతిన స్పందించి తమ న్యాయబద్ధ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ, అవసరమైతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News