PRINT TIME: July 01, 2026 09:50 PM
తహసీల్దార్కు వినతి.. పీఆర్సీ, డీఏలు, బకాయిలపై ఉద్యోగుల డిమాండ్
తహసీల్దార్కు వినతి.. పీఆర్సీ, డీఏలు, బకాయిలపై ఉద్యోగుల డిమాండ్
April 17, 2026 04:43 PM
105 Views
స్థానికం ప్రధాన ప్రతినిధి :
తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk
రామన్నపేట: పీఆర్సీ అమలు, డీఏలు విడుదల, పెండింగ్ బిల్లుల చెల్లింపుతో పాటు ఇతర సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రామన్నపేట మండలంలోని ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు శుక్రవారం తహసీల్దార్ లాల్ బహుదూర్కు వినతిపత్రం సమర్పించారు.
మండల కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో ఉద్యోగులు తమ దీర్ఘకాలిక సమస్యలను వివరించారు. పీఆర్సీని వెంటనే అమలు చేయడంతో పాటు పెండింగ్ డీఏలు విడుదల చేయాలని, రిటైర్డ్ ఉద్యోగుల బకాయిలను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వం త్వరితగతిన స్పందించి తమ న్యాయబద్ధ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ, అవసరమైతే ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి