Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జిల్లా బ్యాడ్మింటన్ ఎంపిక పోటీలు కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు అక్రమ ఇసుక రవాణా టిప్పర్లను సీజ్ చేసిన అధికారులు హనుమకొండ సబ్‌రిజిస్ట్రార్ ఇంటిపై ఏసీబీ మెరుపుదాడులు.. రూ.10 కోట్లకు పైగా అక్రమాస్తుల వెలికితీత శ్రీ సత్యసాయి జిల్లాలో పర్యాటక రంగాభివృద్ధికి పటిష్ట చర్యలు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ పార్థివ దేహానికి నివాళులర్పించిన రాష్ట్ర కార్యదర్శి సామకోటి స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: May 27, 2026 05:58 AM

తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
March 11, 2026 06:17 PM 24 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోటకొండూర్: నూతనంగా నిర్మిస్తున్న మండల తహసీల్దార్ కార్యాలయ భవన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

బుధవారం మోటకొండూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. నిర్మాణ పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. భవనం పూర్తి కావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా కార్యాలయ భవనం నిర్మించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, పనులను నిర్లక్ష్యం చేయకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

తహసీల్దార్ కార్యాలయం పూర్తయితే మండల ప్రజలకు రెవెన్యూ సంబంధిత సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రాజేంద్ర ప్రసాద్, ఎంపీడీఓ ఇందిర, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News