Sthanikam - Truth Matters
Logo
Sthanikam
PRINT TIME: March 11, 2026 08:25 PM

తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
March 11, 2026 06:17 PM 12 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
స్థానికం బృందం

మోటకొండూర్: నూతనంగా నిర్మిస్తున్న మండల తహసీల్దార్ కార్యాలయ భవన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

బుధవారం మోటకొండూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. నిర్మాణ పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. భవనం పూర్తి కావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా కార్యాలయ భవనం నిర్మించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, పనులను నిర్లక్ష్యం చేయకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

తహసీల్దార్ కార్యాలయం పూర్తయితే మండల ప్రజలకు రెవెన్యూ సంబంధిత సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రాజేంద్ర ప్రసాద్, ఎంపీడీఓ ఇందిర, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News