Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
చేయూత పెన్షన్ దరఖాస్తుల గడువు సెప్టెంబర్ 15 వరకు పొడిగింపు- చైర్‌పర్సన్ పావని రమేష్ గౌడ్ “ఒక ఛాన్స్‌ ఉంది.. మాట్లాడి పరిష్కరించుకోండి” రూ.30 వేల లంచం.. రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడితే ఇంట్లో రూ.4.27 కోట్ల కట్టలు! శతాబ్దపు గణిత చిక్కుముడికి తెర.. పవన విద్యుత్‌కు కొత్త దిశ జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 31, 2026 10:25 PM

తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి
11-03-2026 33 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

మోటకొండూర్: నూతనంగా నిర్మిస్తున్న మండల తహసీల్దార్ కార్యాలయ భవన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

బుధవారం మోటకొండూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. నిర్మాణ పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. భవనం పూర్తి కావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా కార్యాలయ భవనం నిర్మించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, పనులను నిర్లక్ష్యం చేయకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

తహసీల్దార్ కార్యాలయం పూర్తయితే మండల ప్రజలకు రెవెన్యూ సంబంధిత సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రాజేంద్ర ప్రసాద్, ఎంపీడీఓ ఇందిర, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


Sthanikam

తహసీల్దార్ కార్యాలయ నిర్మాణం త్వరగా పూర్తి చేయాలి: కలెక్టర్ అనురాగ్ జయంతి

Article Image

మోటకొండూర్: నూతనంగా నిర్మిస్తున్న మండల తహసీల్దార్ కార్యాలయ భవన పనులను వేగవంతంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి అధికారులను ఆదేశించారు.

బుధవారం మోటకొండూర్ మండల కేంద్రంలో నిర్మాణంలో ఉన్న తహసీల్దార్ కార్యాలయ భవనాన్ని ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా పనుల పురోగతిపై అధికారులతో చర్చించారు. నిర్మాణ పనుల నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. భవనం పూర్తి కావడానికి ఇంకా ఎంత సమయం పడుతుందో వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ప్రజలకు సౌకర్యవంతంగా ఉండే విధంగా కార్యాలయ భవనం నిర్మించాలని కలెక్టర్ తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాల నిర్మాణ పనులు ఆలస్యం కాకుండా నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని, పనులను నిర్లక్ష్యం చేయకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ఆదేశించారు.

తహసీల్దార్ కార్యాలయం పూర్తయితే మండల ప్రజలకు రెవెన్యూ సంబంధిత సేవలు మరింత సులభంగా అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు. నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి త్వరలోనే ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ రాజేంద్ర ప్రసాద్, ఎంపీడీఓ ఇందిర, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.


మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News