Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
మొక్కలు నాటుతూ పర్యావరణ పరిరక్షణకు పిలుపు:గ్రామ సర్పంచ్ ప్రియాంక రాజేందర్ అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 26, 2026 03:56 AM

తాగునీటి సమస్యకు చెక్. బోరుకు మోటార్, పైప్‌లైన్ ఏర్పాటు చేసిన సర్పంచ్ విక్రమ్.

తాగునీటి సమస్యకు చెక్. బోరుకు మోటార్, పైప్‌లైన్ ఏర్పాటు చేసిన సర్పంచ్ విక్రమ్.

తాగునీటి సమస్యకు చెక్.  బోరుకు మోటార్, పైప్‌లైన్ ఏర్పాటు చేసిన సర్పంచ్ విక్రమ్.
30-05-2026 286 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామ 4వ వార్డులో రైతువేదిక సమీపంలోని బోరుకు మోటార్ అమర్చి, పైప్‌లైన్ ఏర్పాటు చేయించారు. దీంతో ఆ ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్య నుంచి ఉపశమనం లభించింది.

గ్రామంలో తాగునీటి కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని సర్పంచ్ విక్రమ్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, 4వ వార్డు సభ్యురాలు చిన్నలచ్చి శంకరమ్మ, యువ నాయకులు సింగణబోయిన గణేష్, పగుడాల సుదర్శన్, నీరుడు వెంకటేష్, బండారు దుర్గయ్య, భూతం బిక్షపతి, రాస సత్తయ్య, నక్క వెంకటేష్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గర్ధాస్ కరుణాకర్, గోళ్లేపల్లి యాదయ్య, రాధారపు పద్మ, దొంత నర్సింహా, రాగిరి మల్లేశం, గర్ధాస్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

Sthanikam

తాగునీటి సమస్యకు చెక్. బోరుకు మోటార్, పైప్‌లైన్ ఏర్పాటు చేసిన సర్పంచ్ విక్రమ్.

Article Image

రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామ 4వ వార్డులో రైతువేదిక సమీపంలోని బోరుకు మోటార్ అమర్చి, పైప్‌లైన్ ఏర్పాటు చేయించారు. దీంతో ఆ ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్య నుంచి ఉపశమనం లభించింది.

గ్రామంలో తాగునీటి కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని సర్పంచ్ విక్రమ్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, 4వ వార్డు సభ్యురాలు చిన్నలచ్చి శంకరమ్మ, యువ నాయకులు సింగణబోయిన గణేష్, పగుడాల సుదర్శన్, నీరుడు వెంకటేష్, బండారు దుర్గయ్య, భూతం బిక్షపతి, రాస సత్తయ్య, నక్క వెంకటేష్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గర్ధాస్ కరుణాకర్, గోళ్లేపల్లి యాదయ్య, రాధారపు పద్మ, దొంత నర్సింహా, రాగిరి మల్లేశం, గర్ధాస్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News