తాగునీటి సమస్యకు చెక్. బోరుకు మోటార్, పైప్లైన్ ఏర్పాటు చేసిన సర్పంచ్ విక్రమ్.
తాగునీటి సమస్యకు చెక్. బోరుకు మోటార్, పైప్లైన్ ఏర్పాటు చేసిన సర్పంచ్ విక్రమ్.
Editor Desk
రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామ ప్రజలకు తాగునీటి ఇబ్బందులు తలెత్తకుండా సర్పంచ్ గర్ధాస్ విక్రమ్ ప్రత్యేక చర్యలు చేపట్టారు. రామన్నపేట మండలంలోని ఇంద్రపాలనగరం గ్రామ 4వ వార్డులో రైతువేదిక సమీపంలోని బోరుకు మోటార్ అమర్చి, పైప్లైన్ ఏర్పాటు చేయించారు. దీంతో ఆ ప్రాంత ప్రజలకు తాగునీటి సమస్య నుంచి ఉపశమనం లభించింది.
గ్రామంలో తాగునీటి కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడమే లక్ష్యమని సర్పంచ్ విక్రమ్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారానికి గ్రామ పంచాయతీ ఎల్లప్పుడూ కృషి చేస్తుందని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ నల్ల జయసుధ స్వామి, 4వ వార్డు సభ్యురాలు చిన్నలచ్చి శంకరమ్మ, యువ నాయకులు సింగణబోయిన గణేష్, పగుడాల సుదర్శన్, నీరుడు వెంకటేష్, బండారు దుర్గయ్య, భూతం బిక్షపతి, రాస సత్తయ్య, నక్క వెంకటేష్, మాజీ ఏఎంసీ డైరెక్టర్ గర్ధాస్ కరుణాకర్, గోళ్లేపల్లి యాదయ్య, రాధారపు పద్మ, దొంత నర్సింహా, రాగిరి మల్లేశం, గర్ధాస్ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి