Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
లెక్కల మాస్టారైన జిల్లా కలెక్టర్ 20 వేల పోలీస్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల చేయాలి.. జేఏసీ నేతల హెచ్చరిక ధర్మవరం పట్టణంలోని వన్ టౌన్ ఎస్సైగా బాధ్యతలను స్వీకరించిన ఇషాక్ భాషా నేరం చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోలేరు – జిల్లా ఎస్పీ ఎస్.సతీష్ కుమార్ రొద్దంలో ఘనంగా అనంతశక్తి సొసైటీ 27వ వార్షిక మహాసభ డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ కొత్తచెరువు లో జేసీ ప్రభాకర్ రెడ్డి పుట్టినరోజు వేడుకలు స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ హనుమంతుని పూజలో పాల్గొన్న జనసేన నాయకులు, మార్కెట్ కమిటీ చైర్మన్ పూల శివప్రసాద్. ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: July 01, 2026 11:22 PM

తెలంగాణపై వ్యాఖ్యలు దేశద్రోహమే: కాంగ్రెస్ నేతలు

తెలంగాణపై వ్యాఖ్యలు దేశద్రోహమే: కాంగ్రెస్ నేతలు

తెలంగాణపై వ్యాఖ్యలు దేశద్రోహమే: కాంగ్రెస్ నేతలు
April 17, 2026 08:45 PM 280 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తేజస్వీ సూర్య క్షమాపణ చెప్పాలి.. ఎంపీ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్

రామన్నపేట: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చడం దేశద్రోహానికి సమానమని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ మహమ్మద్ జమీరుద్దీన్, రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్లమెంట్‌లో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అవమానించేలా మాట్లాడటం తగదని పేర్కొన్నారు. తేజస్వీ సూర్య వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, పార్లమెంట్ సాక్షిగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.

దశాబ్దాల పోరాటం, అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. బీజేపీ అగ్రనాయకత్వం ఉద్దేశపూర్వకంగానే తెలంగాణపై దాడులు చేస్తోందని విమర్శించారు.

తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఈ అంశంపై మౌనం పాటించడం విచారకరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉపసర్పంచ్ మోటి రమేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టే సంతోష్ కుమార్, నాయకులు ఎండి నాసర్, వెంకటేశం, మొహమ్మద్ బషీర్, దౌల, ఎండి అక్రమ్, మీర్జా అస్లాం బేగ్, గొలుసుల ప్రసాద్, గొరిగ శేఖర్, బండ లింగస్వామి, ఎండి రిజ్వాన్, ఎండి జానీ, సహదేవ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News