Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
నేడు కోదాడలో హిందూ సమ్మేళనం.... రైతు కుటుంబానికి అండగా రెడ్స్ సంస్థ ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ “అంధకారంలో వెలుగైన మహనీయుడు: అంబేద్కర్ చూపిన సమానత్వ దారి” – డి.డి. దాస్ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు సన్‌రైజర్స్ 'ఉపేషారు'.. కుర్రాళ్ల దెబ్బకు రాజస్థాన్ విలవిల! పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” “జర్మనీ హైడ్రోజన్ రైళ్లు: పర్యావరణానికి శుభసూచి కలిగించే భవిష్యత్తు టెక్నాలజీ” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 17, 2026 10:23 PM

తెలంగాణపై వ్యాఖ్యలు దేశద్రోహమే: కాంగ్రెస్ నేతలు

తెలంగాణపై వ్యాఖ్యలు దేశద్రోహమే: కాంగ్రెస్ నేతలు

తెలంగాణపై వ్యాఖ్యలు దేశద్రోహమే: కాంగ్రెస్ నేతలు
April 17, 2026 08:45 PM 82 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

తేజస్వీ సూర్య క్షమాపణ చెప్పాలి.. ఎంపీ సభ్యత్వం రద్దు చేయాలని డిమాండ్

రామన్నపేట: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును భారత్–పాకిస్తాన్ విభజనతో పోల్చడం దేశద్రోహానికి సమానమని కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ రాష్ట్ర మైనార్టీ సెల్ వైస్ చైర్మన్ మహమ్మద్ జమీరుద్దీన్, రామన్నపేట పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు ఆగ్రహం వ్యక్తం చేశారు.

పార్లమెంట్‌లో చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా జరిగిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను అవమానించేలా మాట్లాడటం తగదని పేర్కొన్నారు. తేజస్వీ సూర్య వెంటనే తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని, పార్లమెంట్ సాక్షిగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అలాగే ఆయన ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు.

దశాబ్దాల పోరాటం, అమరుల త్యాగాలు, ప్రజల ఆకాంక్షల ఫలితంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిందని గుర్తుచేశారు. బీజేపీ అగ్రనాయకత్వం ఉద్దేశపూర్వకంగానే తెలంగాణపై దాడులు చేస్తోందని విమర్శించారు.

తెలంగాణ ప్రజల ఓట్లతో గెలిచిన బీజేపీ ఎంపీలు, కేంద్ర మంత్రులు ఈ అంశంపై మౌనం పాటించడం విచారకరమని అన్నారు.

ఈ కార్యక్రమంలో సర్పంచ్ గరిక సత్యనారాయణ, ఉపసర్పంచ్ మోటి రమేష్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టే సంతోష్ కుమార్, నాయకులు ఎండి నాసర్, వెంకటేశం, మొహమ్మద్ బషీర్, దౌల, ఎండి అక్రమ్, మీర్జా అస్లాం బేగ్, గొలుసుల ప్రసాద్, గొరిగ శేఖర్, బండ లింగస్వామి, ఎండి రిజ్వాన్, ఎండి జానీ, సహదేవ తదితరులు పాల్గొన్నారు.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News