తెలంగాణలో మూడు విడతలుగా డిగ్రీ ప్రవేశాలు…
తెలంగాణలో మూడు విడతలుగా డిగ్రీ ప్రవేశాలు…
Komidala Mahender reddy
తెలంగాణ రాష్ట్రంలో డిగ్రీ ప్రవేశాల ప్రక్రియను ఈసారి మూడు విడతలుగా నిర్వహించనున్నట్లు విద్యాశాఖ వెల్లడించింది. ప్రవేశాల కోసం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ రేపటి నుండి ప్రారంభం కానుంది. విద్యార్థులు తమ ఎంపికల మేరకు కాలేజీలు, కోర్సులు ఎంపిక చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పిస్తోంది.మొదటి విడతలో నమోదు చేసుకున్న విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించి సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు. తదనంతరం మిగిలిన సీట్ల కోసం రెండో విడత ప్రవేశాలు మే 15 నుంచి మే 25 వరకు నిర్వహించబడతాయి. ఇంకా ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేసేందుకు మూడో విడతను మే 31 నుంచి జూన్ 15 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు తెలిపారు.ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత జూలై 1 నుంచి డిగ్రీ తరగతులు ప్రారంభం కానున్నాయి. విద్యార్థులు నిర్ణీత తేదీల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవాలని అధికారులు సూచించారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి