తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర మరువలేనిది రామన్నపేటలో తెలంగాణ అవతరణ వేడుకలు
తెలంగాణ సాధనలో బీజేపీ పాత్ర మరువలేనిది రామన్నపేటలో తెలంగాణ అవతరణ వేడుకలు
Editor Desk
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ కేంద్రంలోని సుభాష్ సెంటర్ వద్ద బీజేపీ ఆధ్వర్యంలో మంగళవారం జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. బీజేపీ మండల అధ్యక్షుడు బండ మధుకర్రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా నకిరేకల్ ఇన్చార్జి నకిరేకంటి మొగులయ్య మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఎందరో అమరవీరుల త్యాగాలు, ప్రజల ఉద్యమాలు, బీజేపీ కృషి ఫలితంగానే సాకారమైందన్నారు. తెలంగాణ సాధన కోసం పార్లమెంట్లో గళమెత్తి పోరాడిన మాజీ కేంద్ర మంత్రి సుష్మా స్వరాజ్ సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షలను గుర్తించి ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ పూర్తి మద్దతు ఇచ్చిందని పేర్కొన్నారు.
కార్యక్రమంలో రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు వనం అంజయ్య, జిల్లా యువ మోర్చా కార్యదర్శి అక్కెనపల్లి సైదులు, బీజేపీ సీనియర్ నాయకులు డోగుపర్తి సుభాష్, సుర్వి హరిబాబు, గోపగోని అశోక్, మచ్చ మహేష్, బైరగోని రమేష్, కైరం కొండ సంతోష్, వీరమల్ల వీరేష్, బాణాల దామోదర్రెడ్డి, చలమల్ల కార్తీక్రెడ్డి, ఏనూతుల సురేష్, కిరణ్శేఖర్, డాకోజి నాగరాజు, కంచి రమేష్, పోతినేని ప్రకాష్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి