Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
జన్మదిన వేడుకలు రద్దు.. మృతుడి కుటుంబానికి రూ.8 లక్షల సాయం అధికారులారా.. మాదాహార్తిని తీర్చండి జనరల్ పవర్ ఆఫ్ అటార్నీ నమూనా మట్టి వాసనలో మన సంస్కృతి.. జానపద కళల్లో తరతరాల జీవన గాథ హెచ్ఆర్పీఎం సంస్థ ఉమెన్ సెల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జాయింట్ సెక్రటరీగా :- పండ్ల లక్ష్మీదేవి న్యాల్కల్‌లో భక్తిశ్రద్ధలతో నాగుల పంచమి వేడుకలు డి ఎం & హెచ్ ఓ కీ వినతి పత్రం డైరెక్ట్ సెల్లింగ్ పరిశ్రమకు గర్వకారణంగా నిలిచిన డాక్టర్ ఎస్.పీ. భరిల్ స్ఫూర్తి పెండ్లి పోలీసింగ్ క్రికెట్ టోర్నమెంట్ ను ప్రారంభించిన జిల్లా ఎస్పీ వేమన విజ్ఞాన యాత్ర బస్సును పరిశీలించిన కలెక్టర్ శ్యాంప్రసాద్ ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు
Sthanikam
PRINT TIME: August 25, 2026 08:12 AM

"తెలంగాణ మా తండ్రి, తాతల జాగీరు కాదు.. ప్రజల ఆత్మగౌరవ ఫలితం" — పవన్ వ్యాఖ్యలకు పొన్నం ఘాటు కౌంటర్

"తెలంగాణ మా తండ్రి, తాతల జాగీరు కాదు.. ప్రజల ఆత్మగౌరవ ఫలితం" — పవన్ వ్యాఖ్యలకు పొన్నం ఘాటు కౌంటర్

"తెలంగాణ మా తండ్రి, తాతల జాగీరు కాదు.. ప్రజల ఆత్మగౌరవ ఫలితం" — పవన్ వ్యాఖ్యలకు పొన్నం ఘాటు కౌంటర్
02-06-2026 21 Views
Reporter
స్థానికం ప్రతినిధి : Sub Editor
Komidala Mahender reddy

తెలంగాణపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ దుమారం రేపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర మంత్రిపొన్నం ప్రభాకర్ ఘాటుగా ప్రతిస్పందించారు. తెలంగాణ ఎవరి వ్యక్తిగత జాగీరు కాదని, ఇది ప్రజల పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం అని స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్లో మరోసారి అహంకారం కనిపించిందని మంత్రి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోనే తన రాజకీయ స్థితిగతులపై అనిశ్చితి ఉన్న నేపథ్యంలో తెలంగాణపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ ఎప్పుడైనా మద్దతుగా నిలిచారా? అమరవీరుల కుటుంబాలకు అండగా ఉన్నారా? అని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం వేలాది మంది చేసిన త్యాగాలను విస్మరించి మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించకుండా మాట్లాడితే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన నాయకులు ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని మంత్రి సూచించారు. తెలంగాణపై పవన్ కల్యాణ్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కారని ఆరోపించారు.

రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారగా, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మాటల యుద్ధానికి తెరలేపినట్లు కనిపిస్తోంది.

Sthanikam

"తెలంగాణ మా తండ్రి, తాతల జాగీరు కాదు.. ప్రజల ఆత్మగౌరవ ఫలితం" — పవన్ వ్యాఖ్యలకు పొన్నం ఘాటు కౌంటర్

Article Image

తెలంగాణపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ దుమారం రేపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర మంత్రిపొన్నం ప్రభాకర్ ఘాటుగా ప్రతిస్పందించారు. తెలంగాణ ఎవరి వ్యక్తిగత జాగీరు కాదని, ఇది ప్రజల పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం అని స్పష్టం చేశారు.

పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్లో మరోసారి అహంకారం కనిపించిందని మంత్రి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్‌లోనే తన రాజకీయ స్థితిగతులపై అనిశ్చితి ఉన్న నేపథ్యంలో తెలంగాణపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ ఎప్పుడైనా మద్దతుగా నిలిచారా? అమరవీరుల కుటుంబాలకు అండగా ఉన్నారా? అని ప్రశ్నించారు.

తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం వేలాది మంది చేసిన త్యాగాలను విస్మరించి మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించకుండా మాట్లాడితే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.

రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన నాయకులు ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని మంత్రి సూచించారు. తెలంగాణపై పవన్ కల్యాణ్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కారని ఆరోపించారు.

రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారగా, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మాటల యుద్ధానికి తెరలేపినట్లు కనిపిస్తోంది.

మీ స్పందన? 0 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News