"తెలంగాణ మా తండ్రి, తాతల జాగీరు కాదు.. ప్రజల ఆత్మగౌరవ ఫలితం" — పవన్ వ్యాఖ్యలకు పొన్నం ఘాటు కౌంటర్
"తెలంగాణ మా తండ్రి, తాతల జాగీరు కాదు.. ప్రజల ఆత్మగౌరవ ఫలితం" — పవన్ వ్యాఖ్యలకు పొన్నం ఘాటు కౌంటర్
Komidala Mahender reddy
తెలంగాణపై చేసిన వ్యాఖ్యలతో మరోసారి రాజకీయ దుమారం రేపిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు రాష్ట్ర మంత్రిపొన్నం ప్రభాకర్ ఘాటుగా ప్రతిస్పందించారు. తెలంగాణ ఎవరి వ్యక్తిగత జాగీరు కాదని, ఇది ప్రజల పోరాటాలు, త్యాగాల ఫలితంగా ఏర్పడిన రాష్ట్రం అని స్పష్టం చేశారు.
పవన్ కల్యాణ్ వ్యాఖ్యల్లో మరోసారి అహంకారం కనిపించిందని మంత్రి విమర్శించారు. ఆంధ్రప్రదేశ్లోనే తన రాజకీయ స్థితిగతులపై అనిశ్చితి ఉన్న నేపథ్యంలో తెలంగాణపై అనవసర వ్యాఖ్యలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో పవన్ ఎప్పుడైనా మద్దతుగా నిలిచారా? అమరవీరుల కుటుంబాలకు అండగా ఉన్నారా? అని ప్రశ్నించారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం వేలాది మంది చేసిన త్యాగాలను విస్మరించి మాట్లాడటం బాధాకరమని పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల మనోభావాలను గౌరవించకుండా మాట్లాడితే ప్రజలే తగిన సమాధానం చెబుతారని హెచ్చరించారు.
రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సమస్యలపై చర్చించాల్సిన నాయకులు ప్రాంతీయ భావోద్వేగాలను రెచ్చగొట్టే వ్యాఖ్యలకు దూరంగా ఉండాలని మంత్రి సూచించారు. తెలంగాణపై పవన్ కల్యాణ్ మరోసారి తన అక్కసును వెళ్లగక్కారని ఆరోపించారు.
రాజకీయ వర్గాల్లో ఈ వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారగా, తెలంగాణ–ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కొత్త మాటల యుద్ధానికి తెరలేపినట్లు కనిపిస్తోంది.

















































పాఠకుల అభిప్రాయాలు
ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.
కామెంట్ను పోస్ట్ చేయండి