Sthanikam - Truth Matters
Logo
తాజా వార్తలు
పెనుకొండలో అవగాహన ర్యాలీ: బాలికల భద్రత, రోడ్డు నియమాలపై చైతన్యం కెనరా బ్యాంకులో గోల్డ్ లోన్‌కు కొత్త షరతులు… వినియోగదారుల ఇబ్బందులు 131వ సవరణ: ప్రజాస్వామ్య బలోపేతమా? లేక కొత్త సవాళ్ల ఆరంభమా? ప్రైవేట్ విద్యపై కఠిన నియంత్రణలు – చైనా మార్పులు ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి ఉప్పల్‌లో 'రైజర్స్' హోరు.. చెన్నైపై హైదరాబాద్ ఘనవిజయం! ఇంటర్ ఫలితాల్లో రొద్దం ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థుల ప్రతిభ 12 గంటల అరుదైన శస్త్రచికిత్స: చేతుల మార్పిడి చేసి చరిత్ర సృష్టించిన భారత వైద్యులు పెట్టుబడి సున్నా.. ఆదాయం మిన్న! కొత్త తరం బిజినెస్ ఐడియాలు! ABN రాధాకృష్ణపై చర్యలు కోరుతూ డీఎస్పీకి ఫిర్యాదు “పూరీ ఆలయం కింద బయటపడ్డ పురాతన భూగర్భ నగరం: జగన్నాథుడి ‘మూలాలు’ ఇప్పుడు ప్రపంచం ముందుకు” ఓటీటీలోకి వాలెంటైన్స్ డే హిట్ 'పూకీ'.. కుర్రకారును ఫిదా చేసిన జెన్-జీ లవ్ స్టోరీ!
Sthanikam
PRINT TIME: April 21, 2026 02:47 PM

తెలంగాణ ఏర్పాటు‌ను ‘భారత్-పాక్ విభజన’తో పోల్చడం దేశద్రోహం: బీఆర్‌ఎస్‌వీ నేత ఆగ్రహం

తెలంగాణ ఏర్పాటు‌ను ‘భారత్-పాక్ విభజన’తో పోల్చడం దేశద్రోహం: బీఆర్‌ఎస్‌వీ నేత ఆగ్రహం

తెలంగాణ ఏర్పాటు‌ను ‘భారత్-పాక్ విభజన’తో పోల్చడం దేశద్రోహం: బీఆర్‌ఎస్‌వీ నేత ఆగ్రహం
April 17, 2026 08:10 AM 96 Views
Reporter
స్థానికం ప్రధాన ప్రతినిధి : తెలంగాణ / ఆంధ్రప్రదేశ్
Editor Desk

నకిరేకల్, :

పార్లమెంట్ ఆమోదంతో రాజ్యాంగబద్ధంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రాన్ని ‘భారత్-పాకిస్తాన్ విభజన’తో పోల్చడం దేశద్రోహానికి సమానమని బీఆర్‌ఎస్‌వీ నకిరేకల్ నియోజకవర్గ మాజీ అధ్యక్షుడు జెట్టి శివ ప్రసాద్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. బీజేపీ ఎంపీ తేజస్వీ సూర్య చేసిన వ్యాఖ్యలు తెలంగాణ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఉన్నాయని విమర్శించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, పార్లమెంట్ చట్టం ద్వారా, భారత రాజ్యాంగ పరిరక్షణలో జరిగిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను తక్కువ చేసి చూపడం అసహనీయమన్నారు. ఈ వ్యాఖ్యలను తక్షణమే ఉపసంహరించుకుని, పార్లమెంట్ సాక్షిగా బేషరతుగా క్షమాపణ చెప్పాలని తేజస్వీ సూర్యతో పాటు బీజేపీ అగ్రనాయకత్వాన్ని డిమాండ్ చేశారు.

దశాబ్దాల పోరాటం, వేలాది మంది అమరుల త్యాగాలు, ప్రజల దీర్ఘకాల ఆకాంక్షల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం అవతరించిందని ఆయన గుర్తుచేశారు. అలాంటి చారిత్రాత్మక ప్రక్రియను వక్రీకరించడం తగదన్నారు.

అలాగే, తెలంగాణ ప్రజల ఓట్లతో ఎన్నికైన బీజేపీ, కాంగ్రెస్ ఎంపీలు ఈ అంశంపై స్పందించకపోవడం బాధాకరమని, ప్రజల గౌరవాన్ని కాపాడాల్సిన బాధ్యత వారిపై ఉందని పేర్కొన్నారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంపై ఉద్దేశపూర్వకంగా అపోహలు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని ప్రజలు తిప్పికొట్టాలని ఆయన పిలుపునిచ్చారు.

మీ స్పందన? 1 స్పందనలు

పాఠకుల అభిప్రాయాలు

ఇప్పటివరకు ఎలాంటి కామెంట్స్ పోస్ట్ చేయలేదు.


కామెంట్‌ను పోస్ట్ చేయండి
Related News
Trending News